AP Elections: అమిత్ షా, నడ్డా AP పర్యటనకు కారణం పొత్తులేనా?

AP: వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు (ap elections) జరగనున్నాయి. కానీ అప్పుడే APలో ఎన్నికల హడావుడి మొదలయింది. వాస్తవానికి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని టాక్ నడుస్తోంది. మరొక అంశం పొత్తులు. తాజాగా ఈ అంశం రోజు రోజుకి చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఒక వైపు జనసేన అధినేత పవన్.. టీడీపీ, బీజేపీ తో పొత్తు పెట్టుకోవాలని చూస్తుండగా ఇంకోవైపు జనసేనతో పొత్తు కొనసాగుతోందని BJP నేతలు అంటున్నారు.

మరోవైపు YCP వ్యతిరేక ఓటు చీలనివ్వనని జననేన అధినేత పవన్ (pawan kalyan) చెపుతున్నారు. BJP, జనసేన (janasena), TDPలు కలిసి పోటీ చేస్తే బాగుంటుందనే యోచనలో పవన్ ఉన్నట్టు సమాచారం. అయితే దీనిపై బీజేపీ అధిష్టానం నుంచి ఇంత వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరోవైపు స్థానిక నాయకులు, కొందరు జాతీయ నాయకులు TDPతో బీజేపీకి పొత్తు లేదని ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో షా, నడ్డా పర్యటనలో ఎలాంటి విషయాలు ప్రకటిస్తారో చూడాల్సి ఉంది.

ఇటీవల TDP మినీ మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. తమ అభ్యర్థుల పేర్లను కూడా పార్టీలు ఒక్కొక్కటిగా ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో BJP అగ్రనేతలు ఏపీపై ఫోకస్ పెట్టారు. రాష్ట్ర పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా (amit shah) విశాఖకు వస్తున్నారు. విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న అమిత్ షా… బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మరోవైపు ఈ నెల 10న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (jp nadda) తిరుపతికి రానున్నారు.