Ambati Rambabu: మేం త‌ప్పు చేస్తే ప‌వ‌న్ బూట్లు తుడుస్తాం

ambati rambabu wants tdp to prove ttd allegations

Ambati Rambabu: అయ్యా ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారూ.. మేం త‌ప్పు చేస్తే మీరు దుర్గ‌గుడి మెట్లు క‌డ‌గ‌టం ఏంటండీ.. అని ప్ర‌శ్నించారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత అంబ‌టి రాంబాబు. ప్రాయ‌శ్చిత్త పూజ చేస్తున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈరోజు విజ‌య‌వాడ‌లోని క‌న‌క దుర్గ అమ్మ‌వారి గుడి మెట్ల‌ను క‌డిగి ప‌సుపు రాసి బొట్లు పెట్టారు. దీనిపై అంబ‌టి రాంబాబు స్పందించారు.

“” ప‌వన్ గారూ.. తిరుమ‌ల ల‌డ్డూ విష‌యంలో మేం త‌ప్పు చేసాం అంటున్నారు. మ‌రి మీరెందుకు దీక్ష‌లు, గుడి మెట్లు క‌డ‌గ‌డాలు వంటివి చేస్తున్నారు? మేం త‌ప్పు చేసామ‌ని నిరూపించండి.. మేమే దీక్ష‌లు చేస్తాం.. గుడి మెట్లు కాదు మీ బూట్లు తుడుస్తాం. అది మానేసి ఆడ‌వాళ్ల‌ను ఎందుకు బ‌య‌టికి లాగుతున్నారు. వైవీ సుబ్బారెడ్డి భార్య ఎంత‌టి భ‌క్తురాలో మీకు తెలుసా. ఆమె పేరిట ఓ గ‌దినే తిరుమ‌ల‌లో క‌ట్టించారు సుబ్బారెడ్డి.  సుబ్బారెడ్డి భార్య రోజూ గోసేవ చేస్తేనే గానీ బ‌య‌టికి రారు. అంతటి భ‌క్తురాలిని ప‌ట్టుకుని తిరుమ‌ల‌కు బైబిల్ ప‌ట్టుకుని వెళ్తోంది అని ఆరోపిస్తున్నారు. అది నోరా ఇంకేమ‌న్నానా? ఇక్క‌డ మీరు మ‌త క‌ల్లోలాల‌ను సృష్టిస్తున్నారు. మేం త‌ప్పు చేసాం అంటూ మీకు అనుకూలంగా ప‌నిచేసే మాజీ ఐజీ చేత విచార‌ణ చేయించ‌డం ఏంటి? అత‌ను మీరు చెప్పిందే రాస్తాడు క‌దా. అలాంట‌ప్పుడు ఐజీ వ‌ర‌కు ఎందుకు? నారా లోకేష్‌తో చేయించండి. చంద్ర‌బాబు నాయుడే తానో పెద్ద స‌నాత‌ని అన్న‌ట్లు మాట్లాడుతున్నారు. తండ్రి చ‌నిపోతే పెద్ద కొడుకుగా గుండు చేయించుకోలేదు. త‌న సోద‌రుడికి చేయించాడు. మ‌రి అదేం ధ‌ర్మం? అదేంటి స‌నాత‌న ధ‌ర్మం? “” అని వెల్ల‌డించారు.