Ambati Rambabu: ప‌వ‌న్ డైలాగ్‌తో ప‌వన్‌కే సెటైరా?

Ambati Rambabu: YSRCP మంత్రి అంబ‌టి రాంబాబు ట్విట‌ర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయ‌న త‌న శాఖ‌కు సంబంధించి ఎంత చురుగ్గా ప‌నిచేస్తారో తెలీదు కానీ.. జ‌న‌సేన‌, తెలుగు దేశం పార్టీల‌కు సంబంధించిన అంశాల‌పై మాత్రం చాలా త్వ‌ర‌గా స్పందిస్తారు. తెలుగు దేశం, జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీల మ‌ధ్య సీట్ల లెక్క‌లు తేలిన నేప‌థ్యంలో అంబ‌టి రాంబాబు ఓ ట్వీట్ పెట్టారు. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను (Pawan Kalyan) అత్తారింటికి దారేది సినిమాలోని ఆయ‌న చెప్పిన డైలాగ్‌నే వాడి సెటైర్ వేసారు. ఎక్కడ నెగ్గాలో తెలియనోడు…. ఎక్కడ తగ్గాలో అసలు తెలియనోడు అని కామెంట్ పెట్టారు.