Ambati Rambabu: ప‌వ‌న్‌ను వ‌దిలేసి సింగిల్‌గా వ‌చ్చే ద‌మ్ముందా?

Ambati Rambabu: చంద్ర‌బాబు నాయుడు జైలు నుంచి వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న‌కు మ‌తి భ్ర‌మించింద‌ని అన్నారు YSRCP మంత్రి అంబ‌టి రాంబాబు. అందుకే ప్రెస్ మీట్లు పెట్టి ఏవేవో మాట్లాడుతున్నార‌ని తెలిపారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి (jagan mohan reddy) శాపాలు పెట్టే బ‌దులు ద‌మ్ముంటే జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను (pawan kalyan) వ‌దిలేసి సింగిల్‌గా వ‌చ్చే ద‌మ్ముందా అని ప్ర‌శ్నించారు. ఆ ద‌మ్ముంటే జ‌గ‌న్‌ను ఓడిస్తాను అని మీడియా ముందు నిర్భ‌యంగా ఎందుకు చెప్ప‌లేక‌పోతున్నార‌ని అన్నారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో కొంద‌రికి టికెట్లు రావ‌డం రాక‌పోవ‌డం స‌హ‌జ‌మ‌ని.. త‌న పార్టీలోని నేత‌ల‌ను అటు ఇటు మారుస్తుంటే చంద్ర‌బాబుకు వ‌చ్చిన ఇబ్బంది ఏంటి అని ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో నారా లోకేష్‌ను ఎందుకు దింపార‌ని అన్నారు. చంద్ర‌బాబు పాల‌న ద‌రిద్రంగా ఉంది కాబ‌ట్టే 2018 ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌జ‌లు 23 సీట్లు ఇచ్చార‌ని గుర్తుచేసారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి పేద‌వాడికి ఇళ్ల ప‌ట్టాలు ఇచ్చిన సంద‌ర్భాలు కూడా లేవ‌ని. జ‌గ‌న్‌కి ఒక్క‌సారి అవ‌కాశం ఇస్తే 30 ల‌క్ష‌ల మందికి ఇళ్ల ప‌ట్టాలు ఇచ్చిన ఘ‌న‌త ఉంద‌ని తెలిపారు.