Ambati Rambabu: చంద్ర‌బాబు ప్ర‌జ‌ల ఓట్ల‌తోనే గెలిచారు.. ఆయ‌న చేసిన దాంట్లో త‌ప్పులేదు

Ambati Rambabu finally agrees that tdp won with people's votes

Ambati Rambabu: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీ కూట‌మి ప్ర‌జ‌ల ఓట్ల‌తోనే గెలిచింద‌ని ఎట్ట‌కేల‌కు ఒప్పుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత అంబ‌టి రాంబాబు. వైఎస్సార్ కాంగ్రెస్ అమలు చేసిన అమ్మ ఒడి ప‌థ‌కాన్ని తెలుగు దేశం పార్టీ త‌ల్లికి వంద‌నం పేరుతో కాపీ కొట్టి త‌మ కంటే ఎక్కువ డ‌బ్బు ఇస్తామ‌ని ప్ర‌క‌టించింద‌ని.. అది మంచి ప‌థ‌కం కాబ‌ట్టి చంద్ర‌బాబు కాపీ కొట్ట‌డంలో ఏమాత్రం త‌ప్పు లేద‌ని తెలిపారు. త‌ల్లికి వంద‌నం చూసే ప్ర‌జ‌లు చంద్ర‌బాబుకు ఓట్లేసి గెలిపించార‌ని పేర్కొన్నారు. చంద్ర‌బాబు నాయుడు ఈవీఎంలను హ్యాక్ చేసి గెలిచార‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కానీ త‌న వ‌ద్ద నిరూపించ‌డానికి స‌రైన ఆధారాలు లేక‌పోవ‌డంతో మౌనంగా ఉండాల్సి వ‌స్తోంద‌ని తెలిపారు. ఈ తరుణంలో అంబ‌టి రాంబాబు ప్ర‌జ‌లే చంద్ర‌బాబుని గెలిపించార‌ని అన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.