Rythu Bandhu: వారికి రాదు.. కొత్త రూల్స్ ఇవే

Rythu Bandhu: తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌భుత్వం రైతు బంధు అమ‌లు విష‌యంలో కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇది వ‌ర‌కు ఎన్ని ఎక‌రాలుంటే అన్ని ఎక‌రాల‌కు రైతు బంధు ల‌భించేది. ఇప్పుడు ఐదు ఎక‌రాల‌కు మించి ఉంటే వారు అర్హులు కాద‌ని అంటున్నారు. అది కూడా సాగు భూముల‌కే వ‌ర్తిస్తుంద‌న్న టాక్‌ వినిపిస్తోంది. లోక్ స‌భ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఎన్నిక‌ల నియ‌మావ‌ళి అమ‌ల్లో ఉన్న నేప‌థ్యంలో ఇప్పుడు రైతు బంధు ప‌డ‌క‌పోవ‌చ్చు. ఎన్నిక‌ల త‌ర్వాతే అర్హుల ఎవ‌రు అనే అంశంపై క్లారిటీ వ‌స్తుంది.