రేవంత్ రెడ్డి ఫోటో ఉండాల్సిందే

all government offices ordered to have revanth reddy photos

Revanth Reddy: ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటం ఉంచాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫొటో సైజు (20×24)ను కూడా ప్రభుత్వమే ఖరారు చేసింది. దీంతో కొందరు మండల అధికారులు సీఎం చిత్రపటానికి రూ.1600 వసూలు చేస్తున్నారు. నగదు చెల్లించి ఫొటోలు తీసుకుపోవాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశిస్తున్నారు. నగదు చెల్లించాలని వాట్సాప్‌లో పెట్టారు. ఈ వార్త పంచాయతీ కార్యదర్శుల గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. పై స్థాయి అధికారులు ఆదేశించడంతో కార్యదర్శులు మౌనంగా ఉండిపోతున్నారు.