Adinarayana Reddy: జ‌గ‌న్ త‌ప్ప గెలిచిన‌ ఎమ్మెల్యేలు మాతో ట‌చ్‌లో ఉన్నారు

Adinarayana Reddy says all ysrcp leaders are in touch with him

Adinarayana Reddy: జ‌మ్మ‌ల‌మ‌డుగులో ఎన్నికైన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించారు. ఎన్నిక‌ల్లో తెలుగు దేశం, జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీ కూట‌మి గెల‌వ‌డంతో వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు షాక్‌లో ఉన్నార‌ని అన్నారు. వారి భ‌విష్య‌త్తు ఏంటో తెలీక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. అయితే ఒక్క జ‌గ‌న్ త‌ప్ప గెలిచిన‌ మిగ‌తా వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లంతా త‌మ‌తో క‌ల‌వాల‌ని చూస్తున్నార‌ని ఆది నారాయ‌ణ రెడ్డి అన్నారు. త‌మ‌ను కేవ‌లం పార్టీలో చేర్చుకుంటే చాల‌ని.. ప‌ద‌వి ఇవ్వ‌క‌పోయినా ఫ‌ర్వాలేద‌ని రిక్వెస్ట్ చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. అదే నిజం అయితే ఇక జ‌గ‌న్ పార్టీ పూర్తిగా క‌నుమ‌రుగైపోయిన‌ట్లే అనుకోవాలి.