Telangana Elections: ఎగ్జిట్ పోల్స్ ర‌చ్చ‌.. ఆ 9 మంది ఏమ‌య్యారు?

Telangana Elections: తెలంగాణ ఎన్నిక‌ల్లో భాగంగా వెలువ‌డిన ఎగ్జిట్ పోల్స్ రాష్ట్రానికి చెందిన ఓ పార్టీ నేత‌ల్లో గుబులు పుట్టించింది. ఓట‌మి భ‌యంతో ఆ పార్టీకి చెందిన దాదాపు 9 మంది నేత‌లు హైక‌మాండ్ కాల్స్ చేస్తున్నా లిఫ్ట్ చేయ‌డంలేద‌ట‌. అస‌లు వారు అందుబాటులోకి రావ‌డంలేద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

గురువారం తెలంగాణ‌లో పోలింగ్ ప్ర‌క్రియ పూర్త‌యింది. ఆ వెంట‌నే ఎగ్జిట్ పోల్స్ రచ్చ మొద‌లైపోయింది. ఇప్ప‌టివ‌ర‌కు వెలువడిన అన్ని ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ గెలుస్తున్న‌ట్లే చూపించాయి. మ‌రోప‌క్క BRS పార్టీ ముఖ్య నేత‌లు KCR, KTRలు ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ అవాస్త‌వాలేన‌ని.. అస‌లు నిజం ఆదివారం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని అంటున్నారు. క‌చ్చితంగా మ‌ళ్లీ తామే అధికారంలోకి వ‌స్తామ‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. రేపు కౌంటింగ్ ప్ర‌క్రియ మొద‌లుకానుంది.