Telangana: రేవంత్ కేబినెట్‌లో ఇద్ద‌రు మ‌హిళా మంత్రులు

Telangana: రేవంత్ రెడ్డి (revanth reddy) ఈరోజు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసాక కేబినెట్ మంత్రులు కూడా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. రేవంత్ కేబినెట్‌లో మొత్తం 11 మంది మంత్రులు ఉండ‌నున్నారు. వారిలో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, ద‌న‌స‌రి అన‌సూయ‌, కొండా సురేఖ‌, మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, జూప‌ల్లి కృష్ణారావు, శ్రీధ‌ర్ బాబు, పొన్నం ప్ర‌భాక‌ర్‌, కోమ‌టి రెడ్డి వెంక‌ట‌రెడ్డి, దామోద‌ర రాజ‌న‌ర‌సింహ ఉన్నారు. వీరిలో ద‌న‌స‌రి అన‌సూయ అలియాస్ సీత‌క్క‌, కొండా సురేఖ‌ల‌కు మాత్ర‌మే మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు.