ఇండియాలో కరోనా డేంజర్ బెల్స్

భారత దేశంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చాప కిందనీరులా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారి కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా కేసులు గణనీయంగా పెరిగాయి. తాజాగా భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 3,016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి, నిన్నటితో పోలిస్తే 40% పెరిగింది. దాదాపు ఆరు నెలల్లో అత్యధిక కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 13,509కి పెరిగాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 2.7 శాతంగా నమోదైంది. కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ రోజు అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.