YSRCP పై రూ 30 కోట్ల బెట్టింగ్.. కార్య‌క‌ర్త అనుమానాస్ప‌ద మృతి

ysrcp supporter dies under mysterious circumstances

 

వైఎస్సార్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త అనుమానాస్ప‌ద మృతి క‌ల‌క‌లం రేపుతోంది. ఏలూరు జిల్లా నూజివీడులోని తూర్పుదిగ‌వ‌ల్లి గ్రామానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. ఇత‌ను వైఎస్సార్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌. ఎన్నిక‌ల‌కు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంద‌ని రూ.30 కోట్ల మేర బెట్టింగ్ వేసాడ‌ట‌. ఆ త‌ర్వాత పార్టీ ఓడిపోవ‌డంతో ఊరు వ‌దిలి వెళ్లిపోవాల‌నుకున్నాడ‌ట‌. ఈ నేప‌థ్యంలో వేణుగోపాల్‌కి చెందిన పొలంలోనే అత‌ని మృత‌దేహం ల‌భించింది. ఒంటిపై గాయాలు ఉండ‌టంతో ఆత్మ‌హ‌త్యా లేక హ‌త్యా అనే కోణంలో పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు. వేణుగోపాల్ భార్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స‌ర్పంచిగా ప‌నిచేసారు.