YS Bharathi Reddy: మా ఆయ‌న‌ది నాట‌కం అయితే.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌ల‌ను కొట్టించుకోమ‌నండి

YS Bharathi Reddy slams chandrababu naidu and pawan kalyan for teasing her husband

YS Bharathi Reddy:  2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో కోడిక‌త్తితో పొడిపించుకుని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎన్నిక‌ల్లో గెలిచార‌ని.. ఇప్పుడు విజ‌య‌వాడ‌లో త‌న‌పై తానే రాళ్లు రువ్వించుకుని ఈ ఎన్నిక‌ల్లో కూడా గెలవాల‌ని అనుకుంటున్నాడ‌ని ఆరోప‌ణ‌లు చేస్తున్నారు తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీల అధినేత‌లు చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

దీనిపై జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌తీమ‌ణి వైఎస్ భార‌తి రెడ్డి స్పందించారు. “” మా ఆయ‌న‌ది డ్రామానా? ఎన్నిక‌ల్లో గెలిచేందుకు సింప‌తీ కోసం రాళ్ల‌తో కొట్టించుకున్నారా? అయితే చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌ను కూడా కొట్టించుకోమ‌నండి. వారికి కూడా మా ఆయ‌న కంటే ఎక్కువ సింప‌తీ వ‌స్తుంది క‌దా. ఇలా రాళ్ల‌తో కొట్టించుకుంటేనే సింప‌తీతో గెలిచేస్తార‌ని అనుకుంటే మ‌రి అలిపిరిలో బాంబు దాడి నుంచి బ‌య‌ట‌ప‌డ్డ చంద్రబాబు నాయుడు కూడా ఆ త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలిచేవారే. కానీ అలా జ‌ర‌గ‌లేదు క‌దా. ఏ నాయ‌కుడు గెల‌వాలో ప్ర‌జ‌ల చేతుల్లో ఉంటుంది. ప్ర‌జ‌ల మ‌ధ్యే తేల్చుకోవాలి “” అని మండిప‌డ్డారు.