పవన్ కళ్యాణ్‌తో మల్టీస్టారర్.. యంగ్​ హీరో ప్లాన్!

ఎలాంటి బ్యాగ్రౌండ్​ లేకుండా హీరోగా టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతున్న​ యంగ్​ హీరో కిరణ్​ అబ్బవరం. ఇటీవలే గీతా ఆర్ట్స్​ నిర్మించిన వినరో భాగ్యము విష్ణుకథ సినిమాతో హిట్​ కొట్టిన కిరణ్​ త్వరలోనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా కిరణ్​ అబ్బవం నటించిన మీటర్​ సినిమా ఏప్రిల్​ 7న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్​ కోసం కిరణ్​ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్​ పవన్ కళ్యాణ్ తో సినిమా గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.
టాలీవుడ్​లో ఈమధ్య బాగా వినిపిస్తున్న పేరు కిరణ్ అబ్బవరం. షార్ట్ ఫిలిమ్స్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో వరుస సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్​ యంగ్​ హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు. గీతా ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ వంటి బడా నిర్మాణ సంస్థల్లో సినిమాలు చేస్తూ అందరి దృష్టి ఆకర్షిస్తున్నాడు. ఏప్రిల్​ 7న ‘మీటర్’ అనే యాక్షన్ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో కిరణ్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అండ్ ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. రమేష్ కాడూరి ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. తమిళ భామ అతుల్య రవి హీరోయిన్ గా నటించగా, సాయి కార్తీక్ సంగీతం అందిచారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాకి ప్రెజెంటర్స్ గా వ్యవహరిస్తున్నారు. తాను నటించిన సినిమాల ప్రమోషన్స్ స్వయంగా చూసుకొనే కిరణ్.. మీటర్ ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో చేస్తున్నాడు.

ప్రముఖ నగరాల్లోని ఇంజనీరింగ్​, డిగ్రీ, పీజీ కాలేజీలకు వెళ్లి యూత్ లో ఈ మూవీ పై బజ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఒక కాలేజీలో స్టూడెంట్స్ తో మాట్లాడిన కిరణ్ పవన్ కళ్యాణ్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఆ కార్యక్రమంలో కిరణ్ మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్ గారితో ఒక ప్రాజెక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నా. అంతా అనుకున్నట్లు జరిగితే ఒక మల్టీస్టారర్ తో మీ ముందుకు వస్తా’ అంటూ వెల్లడించాడు. దీంతో ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కుతుందా? లేదా కిరణ్ అబ్బవరం మాటలు వారికే పరిమితం అయిపోతుందా? అనేది చూడాలి మరి.