“కోహ్లీ బయోపిక్​లో నటించాలనుంది‌‌”

ప్రస్తుతం టాలీవుడ్​, బాలీవుడ్​ అనే తేడాలేకుండా సినీ పరిశ్రమలో బయోపిక్​ల ట్రెండ్ నడుస్తోంది. సినిమాతారలు, పొలిటీషియన్లు, స్టార్ క్రికెటర్ల జీవిత చరిత్రలను సినిమాలుగా మలుస్తున్నారు. ఇప్పటికే చాలా బయోపిక్ లు ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. మరి కొన్ని బయోపిక్​లు షూటింగ్​ దశలో ఉన్నాయి. ఇక ఈ బయోపిక్ మూవీస్ తో నటించడానికి సూపర్ స్టార్లు కూడా పోటీపడుతున్నారు. మహానటి సావిత్రి బయోపిక్​లో నటించి కీర్తి సురేష్​ జాతీయ అవార్డు అందుకుంది. సంజూబాయ్​, 83, ఎన్టీఆర్​ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు కూడా ప్రముఖుల జీవిత కథల ఆధారంగా తెరకెక్కి అభిమానులను ఆకట్టుకున్నవే. ఈక్రమంలోనే తనకు కూడా బయోపిక్ మూవీలో నటించాలి అని ఉంది అని మనసులో మాట బయట పెట్టాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

తాజాగా ఇండియా టుడే కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ ఫ్యామిలీ, సినిమా, రాజమౌళి, RRR, పర్సనల్ విషయాలు.. ఇలా చాలా మాట్లాడారు. బయోపిక్​ల పై ​ మాట్లాడుతూ.. తను విరాట్ కోహ్లీని ఆదర్శంగా తీసుకుంటానని అన్నారు. కుదిరితే కోహ్లీ బయోపిక్ లో నటించాలని ఉంది అంటూ మనసులో మాట బయటపెట్టారు చరణ్​. ఇప్పుడు  చరణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే చాలా మంది క్రికెటర్ల బయోపిక్ లు తెరకెక్కాయి. బాలీవుడ్ స్టార్ హీరోలు అందులో లీడ్ రోల్స్ చేశారు. కపిల్ దేవ్ బయోపిక్ ను రన్ వీర్ సింగ్ చేయగా.. థోనీ బయోపిక్ లో సుశాంత్ సింగ్ అద్భుతంగా నటించాడు. ఈక్రమంలోనే త్వరలో గంగూలీ బయెపిక్ కూడా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ టైటిల్ రోల్ చేయబోతున్నారు. మరి బాలీవుడ్ నుంచి కానీ, సౌత్ నుంచి కానీ దర్శకులెవరైనా స్పందిస్తారేమో చూడాలి. ఫ్యూచర్ లో చరణ్ ను కొహ్లీ పాత్రలో చూసే అవకాశం ఉందంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు.

ఇక రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గామారిపోయారు. హాలీవుడ్ దిగ్గజాల నుంచీ ప్రశంసలు పొందారు. ఆర్ఆర్ఆర్ లో తన నటనను మెచ్చి హాలీవుడ్ దిగ్గజ దర్శకులు జేమ్స్ కామరాన్, స్పిల్ బర్గ్ లాంటి వారు చరణ్ పెర్ఫామెనస్ పై ప్రశంసలు కురిపించారు. ఇక ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాలో చరణ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అక్కడ మన ఇండియన్ ప్రేక్షకులతో పాటు..హాలీవుడ్ ఆడియన్స్ కూడా చరణ్ ను కలవడానికి పోటీ పడ్డారు. త్వరలో చరణ్ హాలీవుడ్ మూవీ కూడా చేయబోతున్నట్టు టాక్.  ప్రస్తుతం రామ్​ చరణ్​, దర్శకుడు శంకర్​ కాంబినేషన్లో భారీ బడ్జెట్​తో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.