Viveka Murder: భాస్కర్ రెడ్డి రిమాండ్ పొడిగింపు

Hyderabad: వైఎస్ వివేకా హత్య(viveka murder) కేసులో సీబీఐ(cbi) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అరెస్టు చేసి విచారిస్తోంది. మరికొందరిని అరెస్టు చేయకుండా విచారిస్తోంది. ఈ క్రమంలో తాజాగా సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్​రెడ్డి(bhasker reddy) రిమాండ్‌ను పొడిగిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. జారీ చేసిన ఆ ఉత్తర్వుల్లో భాస్కర్​రెడ్డి రిమాండ్‌ను మే 10వ తేదీ వరకు పొడిగించింది. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టును సీబీఐ ఆశ్రయించగా… ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎప్పుడైనా సీబీఐ కస్టడీలోకి తీసుకోవచ్చని హైకోర్టు సీబీఐ వారికి ఆదేశాలు జారీ చేసింది.