Viral News: విద్యార్థుల ముందే కొట్టుకున్న టీచ‌ర్లు!

Bihar: విద్యార్థులకు ఉపాధ్యాయులే(Teachers) ఆదర్శం. వారు చెప్పే నీతి పాఠాలే విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. అలాంటి ఉపాధ్యాయులే నీళ్ల కోసం కుళాయి దగ్గర విచక్షణా రహితంగా దెబ్బలాడుకున్నారు. కనీసం విద్యార్థులు చూస్తున్నారని కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. సోషల్​ మీడియా(Social media)లో వైరల్​(Viral news)గా మారిన ఈ సంఘటన బీహార్​లో జరిగింది. ఎన్నో రోజులుగా ఇద్దరు మహిళా ఉపాధ్యాయుల మధ్య రగులుతున్న కోపం ఒక్కసారిగా రచ్చకెక్కడంతో వివాదం కాస్త ఉన్నతాధికారుల వద్దకు చేరుకుంది.

పాట్నాలోని బిహ్తా బ్లాక్ కౌరియా పంచాయతీలోని పాఠశాలలో కాంతి కుమారి ఇన్‌ఛార్జ్ హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తున్నారు. అదే పాఠశాలలో అనితా కుమారి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య ఏదో విషయమై వివాదం నడుస్తోంది. దీనిపై గురువారం ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఒకరి జుట్టును ఒకరు లాగుతూ, పిడిగుద్దులతో కలబడుతూ, కాళ్లతో తన్నుకుంటూ విపరీతంగా కొట్టుకున్నారు. ఈ మొత్తం ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్​లోడ్​ చేయడంతో వైరల్​గా మారింది.