దుబాయ్​లో ఉపాసన సీమంతం.. ఫొటోలు వైరల్​!

పెళ్లైన పదేళ్ల తర్వాత తాము తల్లిదండ్రుతు కాబోతున్నట్లు ప్రకటించి మెగా అభిమానులను సర్​ప్రైజ్​ చేశారు రామ్​ చరణ్​, ఉపాసన దంపతులు. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదిక ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. చాలాకాలంగా చెర్రీ, ఉపాసన దంపతుల సంతానం గురించి రకరకాల రూమర్స్​ చక్కర్లు కొట్టగా ఈ విషయంపై మెగా ఫ్యామిలీ నుంచి అధికారికంగా క్లారిటీ రావడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. మెగా వారసుడు వస్తున్నాడంటూ సోషల్ మీడియాలో కామెంట్లతో చిరంజీవి పోస్ట్​ వైరల్ గా మారింది. తర్వాత ఉపాసన బేబీ బంప్ ఫొటోలు సైతం నెట్టింట్లో హల్ చల్ చేశాయి. అయితే తాజాగా విదేశంలో ఉపాసన సీమంతం వేడుకలు జరిగినట్టు తెలుస్తోంది. అతి కొద్దిమంది బంధువులు, స్నేహితుల మధ్య జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్​ మీడియాలో ప్రత్యక్షమవడంతో మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ ఫొటోల్లో చిరంజీవి, సురేఖ దంపతులు వేడుకకు హాజరైనట్టు తెలుస్తోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్-ఉపాసన ఇద్దరూ ఉన్నత కుటుంబాలకు చెందినవారు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహమైనప్పటికీ కూడా వారు ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతనే సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. 2012లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే పెళ్లయి పదేళ్లయినా ప్రెగ్నెన్సీ గురించి ఎలాంటి వార్త రాకపోవడంతో వీరిపై అనేక రకాల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్​లో ‘శ్రీ హనుమాన్ దీవెనలతో ఉపాసన, రామ్ చరణ్ వారి మొదటి బిడ్డను కనడానికి సిద్ధంగా ఉన్నారు’ అని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అధికారికంగా తెలియజేయడంతో ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. అనంతరం ఉపాసన సరోగసీ ద్వారా బిడ్డను కనబోతుందని మరో వార్త జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలకు ఉపాసన బేబీ బంప్ తో కనపడి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇటీవల రామ్ చరణ్-ఉపాసన జంట సమ్మర్ వెకేషన్ కు దుబాయ్ వెళ్లారు. ప్రస్తుతం అక్కడే ఉన్నారు.

దుబాయ్ వెకేషన్ కు చెర్రీ-ఉపాసనతోపాటు కొంతమంది సన్నిహితులు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడే గ్రాండ్ గా ఉపాసన బేబీ షవర్ (సీమంతం) కార్యక్రమం జరిగినట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితులు మాత్రమే పాల్గొన్నట్టు సమాచారం. ఈ వేడుక దుబాయ్ లోని నమ్మోస్ బీచ్ క్లబ్ లోని స్వాంకీ ప్రాంతంలో జరిగనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉపాసన సీమంతం పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వెకేషన్ తర్వాత చెర్రీ స్టార్​ డైరెక్టర్​ శంకర్​ దర్శకత్వంలో రూపొందుతున్నగేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పాల్గొననున్నాడు. ఈ సినిమాలో చెర్రీ ఎన్నికల అధికారిగా కనిపిస్తాడని టాక్​. ఇటీవలే టైటిల్​ ఖరారు చేసుకున్న ఈ సినిమాలో కైరా అడ్వాణీ చెర్రీతో జత కట్టనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ ప్రొడక్షన్​ హౌజ్​ లైకా నిర్మిస్తోంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆర్ఆర్​ఆర్​ తర్వాత చెర్రీ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.