ఒక‌రు తండ్రిని..మ‌రొక‌రు త‌ల్లిని: రెండు రాష్ట్రాల్లో దారుణాలు

పట్టెడు అన్నం పెట్టి కంటికి రెప్ప‌లా చూసుకోవాల్సిన క‌న్నతండ్రినే అతి కిరాత‌కంగా హ‌త‌మార్చాడు ఓ ప్ర‌బుద్ధుడు. ఈ దారుణ‌మైన ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. తివారీపూర్ ప్రాంతానికి చెందిన సంతోష్ కుమార్ అనే వ్య‌క్తికి, అత‌ని 63 ఏళ్ల‌ తండ్రి ముర‌ళీధ‌ర్‌కి కొన్నేళ్లుగా ఆస్తి విష‌యంలో గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఎలాగైనా త‌న తండ్రిని చంపి ఆస్తిని ద‌క్కించుకోవాల‌ని సంతోష్ ప్లాన్ వేసాడు. తండ్రి ఒంట‌రిగా దొరికితే చంపేయొచ్చు అని ఆలోచించాడు. ఈ నేప‌థ్యంలో ఆదివారం ముర‌ళి ఇంట్లో ఒంట‌రిగా ఉండ‌టం చూసిన సంతోష్ గొడ్డ‌లితో దారుణంగా నరికేసాడు. దాంతో ముర‌ళీధ‌ర్ అక్క‌డిక‌క్క‌డే మృతిచెందాడు. అనంత‌రం మృతదేహాన్ని త‌న అన్న గ‌దిలో ఉన్న సూట్‌కేస్‌లో కుక్కి.. గోర‌ఖ్‌పూర్ ప్రాంతంలో జ‌న‌సంచారం లేని చోట ప‌డేసాడు.

ఇంట్లో తండ్రి క‌నిపించ‌క‌పోవ‌డంతో సంతోష్ సోద‌రుడికి అనుమానం వ‌చ్చింది. ఎక్క‌డికి వెళ్లాడు అని అడిగితే స‌మాధానం చెప్ప‌కుండా మౌనంగా ఉండ‌టంతో సంతోష్ సోద‌రుడికి ఏదో జ‌ర‌గ‌కూడ‌నిదే జ‌రిగింది అని అర్థ‌మైంది. వెంట‌నే తివారీపూర్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసాడు. పోలీసులు సంతోష్‌ను క‌స్ట‌డీలోకి తీసుకుని త‌మ‌దైన శైలిలో ప్ర‌శ్నించ‌గా తానే ఆస్తి కోసం చంపేసాన‌ని ఒప్పుకున్నాడు. పోలీసులు సంతోష్‌ను అరెస్ట్ చేసారు.

మ‌హారాష్ట్ర‌లో మ‌రో ఘ‌ట‌న‌

మ‌హారాష్ట్ర‌లో ఇలాంటి హత్యే క‌ల‌క‌లం సృష్టించింది. పాల్ఘ‌ర్ జిల్లాకు చెందిన వైశాలి అనే 44 ఏళ్ల మ‌హిళ త‌న 26 ఏళ్ల కుమారుడితో క‌లిసి నివ‌సిస్తోంది. ఆదివారం వీరిద్దరూ ఓ పెళ్లి ఫంక్ష‌న్‌కు వెళ్లారు. అక్క‌డ ఏదో విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య పెద్ద గొడ‌వ జ‌రిగింది. బంధువులు వారికి న‌చ్చ‌జెప్పి ఇంటికి పంపించారు. ఈరోజు ఉద‌యం అదే విష‌యమై ఇద్ద‌రూ మ‌ళ్లీ గొడ‌వ ప‌డ‌టంతో చున్నీని మెడ‌కు చుట్టి వైశాలిని హ‌త‌మార్చాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.