SIT చేతికి TSPSC పేపర్​ లీక్​ కేసు!

టీఎస్​పీఎస్సీ పేపర్​ లీక్​ తెలంగాణ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న విషయం తెలిసిందే. AE పేపర్ లీకేజీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసును సిట్‌కు బదిలీ చేస్తూ హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు  ఈ  కేసులో 9 మంది నిందితులకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.  పోలీసులు  8 మంది నిందితులను చర్లపల్లి జైలుకు, మరో నిందితురాలు రేణుకను చంచల్ గూడ మహిళా జైలుకు తరలించారు. రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించారు. నిందితుడు ప్రవీణ్  సెల్ ఫోన్లో చాలా మంది మహిళల ఫోన్ నంబర్లు ఉన్నాయని..టీఎస్పీ ఎస్సీ కి వచ్చే మహిళలతో సంబంధాలన్నాయని గుర్తించారు. ప్రధాన సర్వర్ నుంచి ప్రవీణ్ పేపర్ ను కొట్టేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.