టాలీవుడ్ స్టార్ల స‌మ్మ‌ర్ బ్రేక్

సమ్మ‌ర్ వ‌చ్చేసింది. ఈ స‌మ‌యంలో స‌ముద్ర‌తీరాల్లో సేద‌తీరాల‌ని చాలా మందికి ఉంటుంది. ఇక స‌మ్మ‌ర్ వ‌చ్చిందంటే.. సెల‌బ్రిటీలు కూడా ఏ మాల్దీవ్స్‌కో, మ‌రో ప్ర‌దేశానికో వెళ్లిపోతుంటారు. ఎక్కువ‌గా స‌మ్మ‌ర్ బ్రేక్స్ తీసుకుని ఆ త‌ర్వాత రీఫ్రెష్ అయ్యి తిరిగి ఇండియాకి వ‌స్తుంటారు. ఆ త‌ర్వాత సినిమా షూటింగ్‌ల‌లో పాల్గొంటుంటారు. అయితే మ‌న టాలీవుడ్‌కి చెందిన కొంద‌రు స్టార్లు కూడా స‌మ్మ‌ర్ వెకేష‌న్ ప్లానింగ్ చేసేసుకున్నార‌ట‌.

ఇటీవ‌ల ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏదో ప్ర‌దేశానికి వెకేష‌న్‌కు వెళ్లార‌ట‌. ఆయ‌న హైద‌రాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఎక్క‌డికో వెళ్తున్న‌ప్ప‌టి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. రెండు వారాలు వెకేష‌న్‌లో సేద‌తీరాక ఆయ‌న ఇండియా వ‌స్తార‌ట‌. వ‌చ్చాక ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు.

ఇక సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు కూడా త‌న ఫ్యామిలీతో ఒక నెల పాటు వెకేష‌న్‌కు వెళ్ల‌నున్నారు. వ‌చ్చిన త‌ర్వాత త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. ఇక యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న భార్య‌, పిల్ల‌ల‌తో క‌లిసి వెకేష‌న్‌కు వెళ్ల‌నున్నారు. ఆస్కార్స్ వేడుక‌లు, కొర‌టాల శివ సినిమా షూటింగ్‌ల‌తో బిజీగా ఉన్న తార‌క్ కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకుని వెకేష‌న్ ఎంజాయ్ చేసి రీఫ్రెష్ అవ్వాల‌నుకుంటున్నార‌ట. ఇక మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌లు కూడా బేబీమూన్ ఎంజాయ్ చేయ‌బోతున్నార‌ట‌. ఉపాస‌న త‌ల్లికాబోతున్న సంద‌ర్భంగా ఆమెకే ఎక్కువ స‌మ‌యం కేటాయించాల‌నుకుంటున్నార‌ట. ఇలా మ‌న స్టార్స్ అంతా సమ్మ‌ర్ సీజ‌న్‌లో బాగా సేద‌తీరి రెట్టింపు ఉత్సాహంతో షూటింగ్‌ల‌లో పాల్గొన‌బోతున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.