weather: వాతావరణ మార్పులకు కారణం ఇదే!

vijayawada: తెలుగు రాష్ట్రాల్లో(telugu states)ని ప్రజల్ని ఒకవైపు ఎండ.. మరోవైపు వర్షాలు అవస్థలకు గురిచేస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈ అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు(different weather in telugu states) నెలకొన్నాయి. ఇక వర్షాలకు కారణం క్యుములో నింబస్‌ మేఘాల ప్రభావం అని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ మేఘాల వల్ల పెద్దపెద్ద వడగళ్లు పడతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరో హెచ్చరిక జారీ చేసింది. వాతావరణంలో తీవ్ర మార్పులు ఉంటాయని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. రాబోయే అయిదు రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు ఉంటాయని తెలిపింది. కుండపోత వానలతోపాటు.. 40-50 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుందని హెచ్చరించింది.

మరోవైపు పగటి పూట ఉష్ణోగ్రతల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ పెరుగుదల ఉండొచ్చని అంచనా వేస్తోంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తోంది. గాలి విచ్ఛిన్నం, ద్రోణుల ప్రభావంతో వాతావరణంలో ఈ తరహా మార్పులు సంభవిస్తున్నాయని పేర్కొంది. వర్షంతోపాటు.. పిడుగులు, వడగళ్లు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది.