NTR30లో ఆ పాట రీమిక్స్​?

RRR సినిమాతో పాన్​ఇండియా స్టార్​గా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​. అయితే ఆర్​ఆర్​ఆర్​ రిలీజై ఏడాది కావస్తున్నా తర్వాతి సినిమాపై తారక్​ నుండి ఎలాంటి అప్​డేట్​ లేకపోవడం నందమూరి అభిమానులను కలవరపెడుతున్న విషయం. ఆర్​ఆర్​ఆర్​ తర్వాత ఎన్టీఆర్​ త్రివిక్రమ్​తో సినిమా చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ, కొరటాల సినిమానే ఫైనల్​ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్​ ఇంకా ప్రారంభమవలేదు. తాజాగా NTR30 నుంచి వచ్చిన పోస్టర్​తో అభిమానులకు కాస్త ఊరట లభించింది. ఈ పోస్టర్​తో తారక్​ సరసన జాన్వీ నటించబోతోందనే విషయాన్ని ప్రకటించారు మేకర్స్​. అయితే ఈ సినిమా గురించి తాజాగా మరోవార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. NTR30లో సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి కలిసి నటించిన ‘వేటగాడు’ సినిమాలోని ‘ఆకు చాటు పిందె తడిసే..’ పాటను రీమిక్స్​ చేయనున్నారని టాక్​. ‘ఆచార్య’ సినిమా ఫలితం తర్వాత కొరటాల శివపై తారక్​ అభిమానుల ఒత్తిడి బాగా పెరిగింది. అందుకే ముందుగా అనుకున్న కథకు మరిన్ని అంశాలు జోడించి NTR30 కోసం సిద్ధం చేశారు శివ. ఈ సినిమాతో ఎన్టీఆర్​ ఫ్యాన్స్​కి ఫుల్​ ట్రీట్​ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సూపర్​ హిట్​ పాటనూ జోడించనున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో సీనియర్​ ఎన్టీఆర్​, శ్రీదేవి స్టెప్పులేసిన ఈ పాట తారక్​, జాన్వీకి చక్కగా సరిపోతుందని భావిస్తుందట చిత్ర బృందం.

జాన్వీ కపూర్ పుట్టినరోజును పురస్కరించుకుని యూనిట్ NTR30కి సంబంధించి ఆమె లుక్‌ను విడుదల చేశారు. ‘తుఫాన్‌లో నిశ్శబ్దం’ అంటూ మేకర్స్ వదిలిన ఈ పోస్టర్‌లో జాన్వీ కపూర్ చూడముచ్చటగా ఉంది. ‘తుఫాన్‌లో నిశ్శబ్దం’ క్యాప్షన్‌కు అనుగుణంగానే పోస్టర్‌లో కొండలు, సముద్రం చూపించారు. సముద్రపు అంచున కూర్చున్న జాన్వీ కపూర్ క్యూట్ లుక్‌తో ఆకర్షిస్తోంది.
అతి త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ ముచ్చట పూర్తవగానే.. NTR30 షూటింగ్‌ పూజా కార్యక్రమాలు జరిపి.. వెంటనే సెట్స్‌పైకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. జాన్వీ పోస్టర్​తో అభిమానులు కాస్త చ‌ల్ల‌బ‌డ్డార‌నే చెప్పుకోవాలి.
ఈ నెల‌లో NTR 30 సినిమా షూటింగ్‌ను లాంఛ‌నంగా స్టార్ట్ చేసి షూటింగ్‌ను కూడా షురూ చేయ‌బోతున్నారని తెలుస్తోంది. అమెరికా నుంచి ఆయ‌న తిరిగి వ‌చ్చిన త‌ర్వాత NTR 30 ట్రాక్ ఎక్కేస్తుంది. సినిమా స్టార్ట్ కాకుండానే మేక‌ర్స్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. వ‌చ్చే ఏడాది అంటే 2024, ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయనున్నట్లు ప్రకటించేశారు మేకర్స్​. తెరపై ఎన్టీఆర్​, జాన్వీ జంటను​ చూడాలంటే వచ్చే వేసవి వరకూ ఆగాల్సిందే!