SSMB28: థమన్​ అలక నిజమేనా!

స్టార్​ డైరెక్టర్​ త్రివిక్రమ్​ శ్రీనివాస్​, సూపర్​ స్టార్​ మహేష్​ బాబు కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. SSMB28 వర్కింగ్​ టైటిల్​తో షూటింగ్​ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించేశారు. ఉగాది సందర్భంగా విడుదల చేసిన పోస్టర్​లో మహేష్​ లుక్స్​ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాని రాబోయే సంక్రాంతి అంటే జనవరి 13, 2024న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్​. కాగా ఈ సినిమా టైటిల్​ ఇంకా ఖరారు కాలేదు. అయోధ్యలో అర్జునుడు, అమరావతికి అటు ఇటు అంటూ రకరకాల టైటిల్స్​ వినిపిస్తున్నప్పటికీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. మహేష్​, త్రివిక్రమ్​ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.  కాగా, ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న థమన్​ చిత్ర యూనిట్​పై అలిగారని, ఆయన కారణంగా సెట్లో గొడవలు కూడా జరిగినట్టు ఇన్​సైడ్​ టాక్​.

థమన్​ అటు మహేష్​, ఇటు త్రివిక్రమ్​తోనూ మంచి సినిమాలు చేసి హిట్​ కొట్టారు. త్రివిక్రమ్​ రూపొందించగా థమన్​ సంగీతం అందించిన అల..వైకుంఠపురములో సినిమా పాటలు ఎన్ని రికార్డులు సృష్టించాయో తెలిసిందే.  మహేష్​తోనూ బిజినెస్​మ్యాన్​, సర్కారువారి పాట వంటి హిట్​ సినిమాలకు సంగీతం అందించిన థమన్​ ఈ సినిమా విషయంలో మాత్రం కాస్త ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు మహేష్ బాబు, త్రివిక్రమ్ కు మధ్యలో గొడవలు జరుగుతున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం థమన్ అని పలువురు అంటున్నారు.
SSMB28 ప్రాజెక్టు కోసం థమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే థమన్​తో 3 నెలల క్రితమే ట్యూన్స్ రెడీ చేయమని చెప్పారట త్రివిక్రమ్. కానీ, ఇంతవరకు ఒక్క ట్యూన్ కూడా అతను మెప్పించే విధంగా రెడీ చేయలేదని టాక్. చాలాసార్లు మహేష్ బాబు కూడా థమన్ తో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే రీసెంట్ గా థమన్ సినిమాకు సంబంధించిన పనికి కాస్త బ్రేక్ ఇచ్చి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో కాస్త బిజీగా కనిపించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రాక్టీస్ కోసం కూడా థమన్ కాస్త టైం తీసుకోవాల్సి వచ్చింది. ఆ విషయాన్ని ముందే చిత్ర యూనిట్ తో కూడా ఆయన చెప్పారట. కానీ వాళ్లు మాత్రం ట్యూన్స్ వీలైనంత త్వరగా రెడీ చేస్తే బెటర్ అని సూచనలు ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఈ సినిమా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉండే విధంగా సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే కథలో కూడా ఒక డిఫరెంట్ పాయింట్ను త్రివిక్రమ్ హైలెట్ చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. రకరకాల టైటిల్స్ అయితే చర్చల దశలో ఉన్నట్లుగా ఆ మధ్య టాక్ వినిపించింది. కానీ ఫ్యాన్స్ నుంచి ఆ టైటిల్స్ విషయంలో కాస్త నెగెటివ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్‌ మళ్లీ వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది.