SSMB 29: మహేష్​ సరసన హాలీవుడ్​ భామ!

బాక్సాఫీస్​ వద్ద రికార్డులు కొల్లగొట్టడమే కాకుండా మన దేశానికి మొదటి ఆస్కార్​ సాధించి పెట్టిన చిత్రం ఆర్​ఆర్​ఆర్​. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి రూపొందించిన ఈ సినిమాతో ప్రపంచమంతా టాలీవుడ్​వైపే చూస్తోంది. ఇక, ఈ సినిమా తర్వాత సూపర్​స్టార్ మహేష్​ బాబుతో తన తదుపరి సినిమా తీయబోతున్నట్టు ప్రకటించారు రాజమౌళి. SSMB 29 వర్కింగ్​ టైటిల్​తో తెరకెక్కనున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ వార్త టాలీవుడ్​లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మహేష్​ సరసన నటించేందుకు హాలీవుడ్​ హీరోయిన్​ను దింపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్​ఆర్​ఆర్​లో ఎన్టీఆర్​ జోడీగా ఒలీవియాను ఎంపిక చేసి హిట్​ కొట్టిన రాజమౌళి ఈ సినిమాతో మరో ప్రయోగం చేయనున్నట్టు సమాచారం.

SSMB 29 సినిమాని ఇప్పటివరకూ తీసిన సినిమాలన్నింటికంటే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారు రాజమౌళి. ఈ సినిమా కోసం హాలీవుడ్ ప్రొడ‌క్ష‌న్ హౌసెస్‌తో పాటు టెక్నీషియ‌న్స్‌తోనూ చేతులు క‌లుపుతున్నారు. ఇప్ప‌టికే హాలీవుడ్ సంస్థ క్రియేటివ్ ఆర్టిస్ట్ ఏజెన్సీ (CAA)తో చర్చలు జరిపిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సంస్థ ప్ర‌ముఖ‌ హాలీవుడ్ న‌టీన‌టుల‌ను ఈ సినిమాలో న‌టింప చేయ‌టానికి ఒప్పిస్తుంది. థోర్ మూవీ యాక్ట‌ర్ క్రిస్ హెమ్స్ వ‌ర్త్ ఈ సినిమాలో న‌టిస్తార‌నే టాక్ ఉంది. కాగా.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌గా హాలీవుడ్ భామ‌ను రంగంలోకి దించుతున్నార‌ట జ‌క్క‌న్న‌. సూప‌ర్ స్టార్ 29 వ చిత్రంగా రూపొందున్న ఈ సినిమా క‌థ‌ను సిద్ధం చేసే ప‌నిలో జ‌క్క‌న్న‌, ఆయ‌న తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం మహేష్​ అభిమానులే కాదు, సినీ ప్రేక్ష‌కులు కూడా ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో పూజా కార్య‌క్ర‌మాల‌ను చేసి వ‌చ్చే ఏడాది ప్ర‌థమార్థంలో SSMB 29ను తెర‌కెక్కించేలా రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మహేష్​తో చేసే సినిమాను జేమ్స్ బాండ్‌, ఇండియానా జోన్స్ త‌ర‌హా యాక్ష‌న్ మూవీగా తెరకెక్కించనున్నారు. గ్లోబెల్ రేంజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా SSMB 29ను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు ఇప్ప‌టికే కొన్ని ఇంట‌ర్వ్యూల్లో హింట్​ ఇచ్చారు జక్కన్న. దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.ఎల్.నారాయ‌ణ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. హాలీవుడ్ రేంజ్ యాక్ష‌న్ మూవీ కాబట్టి రూ.500 కోట్ల బడ్జెట్​ అని టాలీవుడ్​ టాక్‌. ప్ర‌స్తుతం మ‌హేష్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా జరుగుతోంది. దీని త‌ర్వాత ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.