చంద్ర‌గిరిలో దారుణం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ స‌జీవ‌ద‌హ‌నం

తిరుప‌తి జిల్లా చంద్ర‌గిరి మండ‌లంలో దారుణం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తున్న ఓ వ్య‌క్తిని కొంద‌రు దుండ‌గులు స‌జీవ ద‌హ‌నం చేసారు. మృతుడు బ్రాహ్మ‌ణ ప‌ల్లికి చెందిన నాగ‌రాజుగా గుర్తించారు. అత‌ను బెంగ‌ళూరులోని ఓ ప్ర‌ముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తున్నాడు. శ‌నివారం అర్థ‌రాత్రి బెంగ‌ళూరు నుంచి బ్రాహ్మ‌ణ‌ప‌ల్లికి వెళ్తుండ‌గా అర్థ‌రాత్రి స‌మ‌యంలో కొంద‌రు దుండ‌గులు కారును ఆపి ఈ దారుణానికి పాల్ప‌డ్డాడు. కారు డోర్ లాకై ఉండ‌డంతో నాగ‌రాజు కారులోనే స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యాడు. తెల్ల‌వారుజామున స్థానికులు పోలీసులు ఫిర్యాదు చేసారు. ఈ దారుణానికి ఎందుకు పాల్ప‌డ్డారు అన్న విష‌యంపై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలిపారు.