Manoj Naidu: కాల్పులు జ‌రిపిన సీరియ‌ల్ న‌టుడు

Shamirpet: షామిర్‌పేట్ సెల‌బ్రిటీ క్ల‌బ్‌లో కాల్పుల క‌ల‌క‌లం చోటుచేసుకుంది. మ‌నోజ్ నాయుడు (manoj naidu) అనే టీవీ సీరియ‌ల్ న‌టుడు సిద్ధార్ధ్ దాస్‌ (siddarth das) అనే వ్యక్తిపై కాల్పులు జరిపాడు. సిద్ధార్థ్ దాస్ త‌న భార్య స్మిత‌తో 2019లో విడిపోయారు. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. విడాకులు తీసుకున్నాక స్మిత‌.. మ‌నోజ్ నాయుడుతో (manoj naidu) స‌హ‌జీవ‌నం చేస్తోంది. వీరు సెలబ్రిటీ క్లబ్‌లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం సిద్ధార్థ్ తన పిల్లలను చూసేందుకు సెలబ్రిటీ క్లబ్‌కు వచ్చాడు. మనోజ్‌ కొడుతున్నాడ‌ని పిల్లలు చెప్పడంతో అత‌నితో గొడ‌వ‌ప‌డ్డాడు సిద్ధార్థ్‌. దాంతో కోపంలో మనోజ్ (manoj naidu) ఎయిర్ గన్‌తో సిద్ధార్థ్‌పై కాల్పులు జరిపాడు. వెంట‌నే సిద్ధార్థ్‌ను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. పోలీసులు మ‌నోజ్‌పై కేసు న‌మోదు చేసారు.