నా పోస్ట‌ర్ ఎక్క‌డ‌?.. నిర్మాత‌పై హీరోయిన్ ఫైర్

ఉగాది సంద‌ర్భంగా త‌న పోస్ట‌ర్‌ను రిలీజ్ చేయ‌లేద‌ని.. హీరోయిన్ సంయుక్త ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. సుప్రీం హీరో సాయి ధ‌రమ్ తేజ్ క‌థానాయ‌కుడిగా విరూపాక్ష సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో సంయుక్త హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. నిన్న ఉగాది సంద‌ర్భంగా ఎన్నో కొత్త సినిమాల నుంచి ఇంట్రెస్టింగ్ పోస్ట‌ర్లు రిలీజ్ అయ్యాయి. విరూపాక్ష నుంచి ఇప్ప‌టికే సాయిధ‌ర‌మ్ తేజ్‌కు సంబంధించిన పోస్ట‌ర్ వ‌చ్చింది. ఉగాదికి సంయుక్త‌కు సంబంధించిన పోస్ట‌ర్ రిలీజ్ చేస్తాం అన్నారు. కానీ చేయ‌లేదు. దాంతో సంయుక్త ట్విట‌ర్ వేదిక‌గా అస‌హ‌నం వ్య‌క్తం చేసారు.

“విరూపాక్ష టీంతో క‌లిసి నేను చేసిన జ‌ర్నీని నేను ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను. గొప్ప న‌టులు, టెక్నీషియ‌న్ల‌తో క‌లిసి ప‌నిచేసినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. కానీ ఈ ఉగాదికి నా క్యారెక్ట‌ర్‌కు సంబంధించిన పోస్ట‌ర్ రిలీజ్ చేస్తాన‌ని నిర్మాణ సంస్థ మాటిచ్చింది. పోస్ట‌ర్ ఎక్కడ?” అని ప్ర‌శ్నించారు. దీనికి నిర్మాణ సంస్థ ఎస్‌వీసీసీ టీం స్పందిస్తూ.. “క్ష‌మించండి. త్వ‌ర‌లో పోస్ట‌ర్ రిలీజ్ చేస్తాం” అని బ‌దులిచ్చారు. దీనికి సంయుక్త ఓకే అంటూ ఇరిటేట్ అవుతున్న రియాక్ష‌న్ ఇచ్చారు. అయితే ఇది ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా హీరోయిన్ అలా కామెంట్ చేసార‌ని కొంద‌రు నెటిజ‌న్లు కామెంట్లు పెడుతుంటే..మ‌రికొంద‌రు మాత్రం “నువ్వుమైనా టాప్ హీరోయిన్‌వి అనుకుంటున్నావా పోస్ట‌ర్ రిలీజ్ చేసేంత‌వ‌ర‌కు ఆగ‌లేవా” అంటూ తిట్టిపోస్తున్నారు.