ఎన్ని కోట్లు ఇచ్చినా వాళ్ల‌తో సినిమా చేయనన్న సమంత

తెలుగుతోపాటు పలు భాషల్లో నటిస్తూ దక్షిణాదితోపాటు బాలీవుడ్​లోనూ రాణిస్తున్న స్టార్​ హీరోయిన్​ సమంత. సినిమాలే కాకుండా టాక్​ షోలు, వ్యాపారాలతోనూ సక్సెస్​ఫుల్​గా రాణిస్తున్నారు. టాలీవుడ్​తోపాటు దక్షిణాదిన టాప్​ హీరోలందరితో నటించిన సమంత యంగ్​ హీరోలతోనూ జోడీ కట్టింది. తాజాగా సమంత ప్రధానపాత్రలో నటించిన శాకుంతలం ఏప్రిల్​ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్న సమంత తన వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చాలా విషయాలు పంచుకుంటున్నారు. కాగా, సమంత గతంలో నటించిన ఓ యంగ్​ హీరోతో మళ్లీ సినిమా ఛాన్స్​ వస్తే నో చెప్పారట. ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ హీరో సరసన నటించనని తేల్చి చెప్పిందట. అంతేకాదు, మొదటి సినిమాతోనే సెన్సెషన్​ క్రియేట్​ చేసిన ఓ దర్శకుడితోనూ సినిమా చేయనని చెప్పిందట. ఇంతకీ ఎవరా హీరో, ఎవరా దర్శకుడు.. ?

ఆర్ఎక్స్ 100 (RX 100) సినిమా అప్పట్లో ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా విడుదలైన రెండు మూడు రోజులకే బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో కుర్రకారును ఫిదా చేసింది. ఆర్ఎక్స్ 100 సినిమాకు దర్శకత్వం చేశారు అజయ్ భూపతి. అజయ్ దర్శకత్వంలో వచ్చిన మరో సినిమా మహాసముద్రం. అయితే ఈ సినిమాలో హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని అనుకున్నారట. అదే సమయంలో సమంతని హీరోయిన్ గా పెట్టుకుందామని అజయ్ భూపతి అనుకుని.. సమంతని అడిగారట. అయితే సమంత మాత్రం అంగీకరించలేదట. పైగా తాను తీసుకునే రెమ్యునరేషన్ కంటే 5 రెట్లు ఎక్కువ ఇచ్చినా చెయ్యను అని స్పష్టంగా చెప్పేశారట సమంత.

ఆ హీరోతో చేయను అని చెప్పడానికి ప్రధాన కారణం సమంత స్టార్‌‌ హీరోయిన్‌గా ఎదిగారు. అంతేకాకుండా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి హీరోగా క్రేజ్ లేదు. అప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్‌ తో కలిసి అల్లుడు శీను సినిమాలో సమంత నటించారు. దాంతో మళ్లీ ఆ హీరోతో నటించడం సమంతకి ఇష్టం లేక రిజెక్ట్ చేశారని టాక్. ఇక మరో కారణం ఏంటంటే అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100 సినిమాలో పాయల్ రాజ్ పుత్ తో చాలా ఎక్స్‌పోజింగ్ చేయించారు. రొమాంటిక్ సీన్స్‌ కూడా పెట్టారు.

తన నెక్స్ట్ సినిమాలో ఇంకా ఎక్కువగా ఎక్స్‌పోజింగ్ ఉంటుందని అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయట. ఇక ఆ వార్తలు సమంత చెవిన పడటం తో అలాంటి ఎక్స్‌పోజింగ్ చేసే సన్నివేశాల్లో నటించడం తన వల్ల కాదని, ఒకవేళ ఆ సినిమాకి ఓకే చెబితే కచ్చితంగా ఎక్స్‌పోజింగ్ చేయాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఐదు కోట్లు ఇచ్చినా సరే ఆ సినిమాలో నటించను అని తెగేసి చెప్పారట సమంత. ఇక మహాసముద్రం సినిమాలో సిద్ధార్థ్, శర్వానంద్, అదితి రావు హైదరీ నటించారు. ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ఆర్‌‌ఎక్స్‌ 100 సినిమాకు వచ్చిన క్రేజ్‌తో ఓపెనింగ్స్‌ బాగానే ఉన్నప్పటికీ సినిమా టాక్‌ మాత్రం నెగెటివ్‌గా వచ్చింది. ఇక, బెల్లంకొండ శ్రీనివాస్​ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్​తో బాలీవుడ్​లో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. వి.వి. వినాయక్​ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇటీవలే విడుదలైన టీజర్​కు మంచి స్పందన లభిస్తోంది. బాలీవుడ్​లోనైనా శ్రీనివాస్​ హీరోగా హిట్​ కొడతాడో చూడాలి మరి!