Virupaksha బ్లాక్‌బ‌స్ట‌ర్.. ధ‌ర‌మ్ తేజ్ ఎమోష‌న‌ల్

Hyderabad: సుప్రీం హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్(sai dharam tej) న‌టించిన విరూపాక్ష(virupaksha) సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఎక్క‌డ చూసినా బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ వినిపిస్తోంది. అటు ఓవ‌ర్‌సీస్‌లోనూ మంచి వసూళ్లు వ‌స్తున్నాయ‌ని సినీ ఎక్స్‌ప‌ర్ట్స్ చెప్తున్నారు. ఈ నేప‌థ్యంలో సాయి ధ‌ర‌మ్ తేజ్ ఎమోష‌న‌ల్ అయ్యాడు. ద‌ర్శ‌కుడు కార్తిక్‌ని హ‌గ్ చేసుకుని భావోద్వేగానికి లోన‌య్యాడు. యాక్సిడెంట్ త‌ర్వాత ధ‌ర‌మ్ తేజ్ న‌టించిన సినిమా ఇది. ఆయ‌న లాస్ట్ హిట్ కొట్టింది చిత్ర‌ల‌హ‌రి సినిమాతోనే. ఇప్పుడు వీరూపాక్ష‌తో స్ట్రాంగ్ క‌మ్‌బ్యాక్ ఇచ్చాడు. ఇందులో సంయుక్త హీరోయిన్‌గా న‌టించారు. ఆమె న‌ట‌న‌కు కూడా మంచి మార్కులు ప‌డ్డాయి. మొత్తానికి ధ‌ర‌మ్ తేజ్ 2023లో ఫ‌స్ట్ హిట్ కొట్టేసాడ‌నే చెప్పాలి.