Ruturaj Gaikwad: టీంలోని వ్య‌క్తి వ‌ల్లే గెల‌వ‌లేక‌పోయాం అనిపిస్తోంది

Ruturaj Gaikwad: నిన్న జ‌రిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్ (Chennai Super Kings) వ‌ర్సెస్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ (Delhi Capitals) మ్యాచ్‌లో ఎం ఎస్ ధోనీ (MS Dhoni) వ‌రుస సిక్సులు, ఫోర్లు బాదిన‌ప్ప‌టికీ విజ‌యం ఢిల్లీ క్యాపిటల్స్‌నే వ‌రించింది. ఇంకొక్క ఓవ‌ర్ ఉండి ఉంటే కచ్చితంగా ధోనీ చెన్నై సూప‌ర్ కింగ్స్‌ను గెలిపించేవాడే. అయితే నిన్న మ్యాచ్ ఓడిపోవ‌డానికి కార‌ణం ఎవ‌రో వెల్ల‌డించాడు టీం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.

ఒక ర‌కంగా మ్యాచ్ ఓడిపోవ‌డానికి కార‌ణం ర‌చిన్ అని రుతు అభిప్రాయ‌ప‌డ్డాడు. ఆట మొద‌టి భాగంలో పిచ్ బాగా స‌హ‌క‌రించింద‌ని ఆ తర్వాత బాగా ట‌ఫ్ అయింద‌ని అన్నాడు. బౌలింగ్‌లో ఎక్ట్సా మూవ్‌మెంట్, ఊహించ‌ని బౌన్స్‌ల వ‌ల్ల ర‌చిన్ క‌న్‌ఫ్యూజ్ అయ్యాడ‌ని.. అత‌నికి ఈ మార్పులు కొత్త‌గా అనిపించాయ‌ని అన్నాడు. ఒక ర‌కంగా చెప్పాలంటే ర‌చిన్‌కి ఇది కొత్త కావ‌డంతో తాము స్కోర్ చేయ‌లేక‌పోయామ‌ని అన్నాడు. నిన్న చెన్నై సూప‌ర్ కింగ్స్ ఓడిపోయిన‌ప్ప‌టికీ వింటేజ్ ధోనీని చూసాం అన్న ఆనందంలో ఓట‌మిని కూడా మ‌ర్చిపోయారు అభిమానులు.