అసెంబ్లీలో TDP రౌడీలు: రోజా హాట్ కామెంట్స్

ఏపీ అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ నేత‌ల మ‌ధ్య జ‌రిగిన ర‌చ్చ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. టీడీపీ నేత‌లు స్పీక‌ర్ వ‌ద్దకు వెళ్లి మాట్లాడుతున్న స‌మ‌యంలో వైసీపీ నేత‌లు వారిపై దాడికి పాల్ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో ఇరు పార్టీల వారు ఒక‌రిపై ఒక‌రు చేయిచేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై వైసీపీ పర్యాటక మంత్రి ఆర్కే రోజా స్పందించారు. “స‌భ‌లో ప్ర‌తిరోజూ ఎస్సీ నేత‌లతో అధికార‌పార్టీ ఎమ్మెల్యేలు, స్పీక‌ర్‌ను అస‌భ్య‌ప‌ద‌జాలంతో తిట్టించ‌డం, స్పీక‌ర్ పోడియం వ‌ద్ద‌కు వెళ్లి ర‌చ్చ‌చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేల‌ను శాశ్వ‌తంగా స‌స్పెండ్ చేయాలి. గతంలో కూడా బీసీల తోకలు కత్తిరించాలని బీసీలు జడ్జీలుగా పనికిరారని మాట్లాడిన చంద్రబాబుకు బీసీలంటే ఎప్పుడు చులకనే, స్పీకర్ పోడియం వద్దకు వచ్చి బీసీ సామాజిక వర్గానికి చెందిన స్పీకర్ పై పేపర్లు చింపి విసురుతూ ఎస్సీ,ఎస్టీ MLAలపై దాడి చేసిన టీడీపీ MLAలను చట్టసభ నుండి సస్పెండ్ చెయ్యాలి.” అని ట్విట‌ర్‌లో పేర్కొన్నారు.  అసెంబ్లీలో టీడీపీ రౌడీలు, వైసీపీ ద‌ళిత నేత‌పై అసెంబ్లీలో ఎటాక్ అంటూ ట్యాగ్స్ చేసారు. అసెంబ్లీలో జ‌రిగిన దాడి ప‌ట్ల నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ ఈరోజు ఏపీలో బ్లాక్ డే అని కామెంట్ చేసారు.