RC-15 టైటిల్​ అదేనా.. చెర్రీ బర్త్​డే కానుకగా ఫ్యాన్స్‌కి ట్రీట్​!

మెగా పవర్​ స్టార్​ రామ్‌ చరణ్‌ హీరోగా స్టార్​ డైరెక్టర్​ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్‌ 15వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను ప్రస్తుతం ఆర్‌సీ 15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు.​ ఈ సినిమాకు సంబంధించి మరో వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. మార్చి 27న రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్‌ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు ‘సర్కారోడు’ అనే టైటిల్‌ను ఖరారు చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమాను ప్రకటించి చాలా రోజులు అవుతోన్న ఇప్పటికీ సినిమా టైటిల్‌ను ప్రకటించకపోవడం గమనార్హం. దీంతో అభిమానుల్లో ఈ సినిమా టైటిల్‌ ఏంటన్న దానిపై ఆసక్తినెలకొంది. రామ్‌చరణ్‌ ఈ సినిమాలో ఎలక్షన్‌ కమీషనర్‌గా కనిపించనున్నాడన్న వార్తలు వచ్చిన క్రమంలో, ఈ చిత్రం రాజకీయాంశాల చుట్టూ ఉంటుందనే చర్చ జరిగింది. యస్‌జె సూర్య ముఖ్యమంత్రిగా నటించనున్నారని, రాజకీయ వ్యవస్థకు, ప్రభుత్వ వ్యవస్థకు మధ్య జరిగే సంగ్రామమే ఈ సినిమా కథాంశమని వార్తలు వచ్చాయి.

ఇదిలావుంటే ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల తర్వాత రామ్ చరణ్ చేస్తున్న చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉంటాయనటంలో సందేహం లేదు. అయితే పాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ మీడియా సంస్థ ZEE ఛానెల్ దాదాపు రూ. 150 కోట్ల రూపాయల కి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు స్ట్రీమింగ్ భాగస్వామిగా ZEE5 ఓటీటీతో డీల్ కుదర్చుకుందట. కాగా 2023 సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇకపోతే ఈ సినిమాలో చరణ్ ఎలక్షన్ కమీషనర్ గా నటించనుండగటంతో పాటు, ఓ మాస్ పాత్రతో ద్విపాత్రాభినయం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.అంతకాక రామ్ చరణ్ ఆ మధ్యన ఇంటర్వ్యూ లో ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పుకొచ్చారు .‘తెర మీద ఆయన సినిమాలు చూసి ఇష్టపడతాం.ఇక ఇప్పుడు ఆయనతోనే కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు చరణ్.
ఇక, ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌లో ఇది 50వ చిత్రం కావడం మరో విశేషం. ఇంకా షూటింగ్ కూడా పూర్తి చేసుకోని ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో చెర్రీకి జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోన్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ , అంజలి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మార్చి 27వ వరకు వేచి చూడాల్సిందే.