నిర్మాతగా గెలిపించండి.. “క్రాక్​2” తప్పక ఉంటుంది

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రావణాసుర. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగర్కర్, మేఘ ఆకాష్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. యంగ్​ హీరో సుశాంత్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. రవితేజ నెగిటివ్స్ షేడ్స్ లో కనిపించబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజయిన టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నాయి. ఈ సినిమాకి అభిషేక్ నామాతో పాటు రవితేజ కూడా నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ఏప్రిల్​ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ..

‘నా ఎనర్జీ, నా ఉత్సాహం, నా ప్రోత్సాహం.. తమ్ముళ్లు మీరే. ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ తో ఫస్ట్ టైం చేశాను. మా డైరెక్టర్ తో బాగా సింక్ లో ఉండి పనిచేశాడు. మాములుగా యాక్టర్స్ స్పెషల్ అప్పీరెన్స్ ఇస్తారు సినిమాల్లో. ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ అప్పీరెన్స్. నా భీమ్స్ స్పెషల్ గా ఒక సాంగ్ చేశాడు. ఈ సినిమాలో సౌండ్ ఎక్సలెంట్ గా ఉంటుంది. మీరంతా బాగా ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. మ్యూజిక్ డైరెక్టర్ అంతబాగా ఇచ్చాడు. ఈ సినిమా వాళ్ళ ఒక మంచి టెక్నీషియన్ ని కలిశాను. ఈ సినిమాకి పనిచేసిన రైటర్ శ్రీకాంత్ పుష్ప 2కి కూడా పనిచేస్తున్నాడు. ఫ్యూచర్ లో మరిన్ని సినిమాలు ఇతనితో చేస్తున్నాను. హైపర్ ఆదితో నా కాంబో అందరికి నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకుంటారు. ఈ సినిమా నాకు బాగా నచ్చింది. మీ అందరికి నచ్చుతుంది. కచ్చితంగా థియేటర్స్ లో విజిల్స్ పడతాయి. ఈ సినిమా టైటిల్స్, పోస్టర్స్ అన్ని డిజైన్ చేసింది ఈ సినిమా నిర్మాత అభిషేక్ నామా. ఈ సినిమా హిట్ అయి ప్రొడ్యూసర్స్ గా నాకు, అభిషేక్ కి మంచి పేరు రావాలి. మేమిద్దరం కలిసి భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేస్తాము. కనీసం పది సినిమాలైనా కలిసి చేయాలనుకున్నాం. సుశాంత్ చాలా సాఫ్ట్, అతను బయటకు రావాలి. ఈ సినిమాతో కొత్త సుశాంత్ చూస్తారు. ఈ సినిమా హిట్ తో డైరెక్టర్ నెక్ట్ లెవెల్ కి వెళ్తాడు. ఏప్రిల్ 7న థియేటర్స్ దద్దరిల్లిపోతాయి. జై సినిమా ’ అంటూ రావణాసుర విశేషాలు పంచుకున్నారు.

ఇక ఈ కార్యక్రమానికి దర్శకులు గోపీచంద్ మలినేని, హను రాఘవపూడి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపీచంద్​ మలినేనిని క్రాక్ 2 గురించి ఫ్యాన్స్ ప్రశ్నించగా.. ‘తప్పకుండా ఉంటుంది. త్వరలోనే క్రాక్ 2తో రాబోతున్నా’ అంటూ బదులిచ్చాడు. ఇక ఈ మాటలు విన్న రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా గోపీచంద్​ మలినేని బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి సినిమాతో హిట్​ కొట్టిన సంగతి తెలిసిందే.