Ravanasura: A సర్టిఫికెట్​ సినిమాతో రానున్న రవితేజ!​

మాస్​ మహారాజ రవితేజ తాజాగా నటించిన చిత్రం రావణాసుర. ఈ సినిమా ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకానుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్​ మిలియన్ల కొద్దీ వ్యూస్​తో యూట్యూబ్​లో రికార్డులు బ్రేక్​ చేస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ మూవీపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా సెన్సార్​ కూడా పూర్తి చేసుకుంది . పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా రాబోతున్న రావణాసుర చిత్రానికి సెన్సార్ బోర్డ్​ A సర్టిఫికెట్‌ను జారీ చేయగా, ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 21 నిమిషాలుగా లాక్ చేసింది చిత్ర యూనిట్. ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీకి ఇది రెగ్యులర్ రన్‌టైమ్. దీంతో ఈ సినిమాలో మాస్ రాజా పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా.. ఈ సినిమాలో రవితేజ పాత్ర ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ‘రావణాసుర’ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సంగీతాన్ని అందించిన రావణాసుర సినిమాలో అను ఇమాన్యూయేల్, మీనాక్షి చౌదరి, ఫరియా అబ్ధాల్లా హీరోయిన్లుగా నటించారు. సుశాంత్ కీలక పాత్రలో నటించారు.

ఏప్రిల్​ 7న సినిమా విడుదల కానున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 1న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించబోతున్నారు. ఇక, ఈ గ్రాండ్​ ఈమెంట్​కికి నేచురల్ స్టార్ నాని గెస్టుగా వస్తున్నారని తెలుస్తోంది. ‘దసరా’ ప్రమోషన్స్‌ లో రవితేజ భాగం అయినట్లే.. ఇప్పుడు ‘రావణాసుర’ కోసం నాని వస్తున్నాడని టాక్​. ఇదే నిజమైతే ఈ మూవీ కూడా హిట్ అయినట్లే అని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
ఈ మధ్య కాలంలో వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ‘రావణాసుర’ చిత్రంలో నటించారు. టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా 2022 సంక్రాంతి పండుగకు ప్రారంభించారు. పోయనేడాది డిసెంబర్‌‌లో ‘ధమాకా’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకున్నారు రవితేజ. ఈ చిత్రంతో వంద కోట్ల క్లబ్‌లోకి కూడా చేరిపోయారు. ఈ సంక్రాంతికి వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీలో చిరంజీవితో కలిసి రవితేజ సందడి చేశారు. ఈ సినిమా ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది.
ఇక, రావణాసుర తరువాత టైగర్ నాగేశ్వరరావు టైటిల్‌తో పాన్‌ ఇండియా సినిమా చేస్తున్నారు రవితేజ. ఈ సినిమా షూటింగ్‌ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా రిలీజ్ చేశారు. వంశీ దర్శకత్వం వహిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నూపూర్‌‌ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిషేక్‌ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌‌ ఈ సినిమాను నిర్మిస్తోంది.