Rapaka Varaprasada Rao: EVM లోపం కాదు.. ప్ర‌జ‌లు మాకు ఓటెయ్య‌లేదు

Rapaka Varaprasada Rao says ysrcp lost because people did not vote

 

Rapaka Varaprasada Rao:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెల‌వ‌క‌పోవ‌డానికి ఈవీఎంల లోపం ఏమాత్రం కాద‌ని అన్నారు ఆ పార్టీ ఎంపీ రాపాక వ‌ర‌ప్ర‌సాద రావు. మొన్న జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో రాపాక అమ‌లాపురం నుంచి పోటీ చేసారు. అయితే తమ‌కు కేవ‌లం 40 శాతం ఓట్లు ప‌డటానికి కార‌ణం ఈవీఎంల‌ను హ్యాక్ చేయ‌డ‌మే అని జ‌గన్ మోహ‌న్ రెడ్డి ఎప్ప‌టినుంచో ఆరోపిస్తున్నారు. దీనిపై రాపాక స్పందించారు. ఈవీఎంల లోపం కాదు ఏమీ కాదు. ప్ర‌జ‌లు ఓట్లు వేయ‌క‌పోవ‌డం వ‌ల్లే తాము ఓడిపోయామ‌ని నిజాన్ని ఒప్పుకున్నారు.