BRS: సొంత గూటికి చేరుకున్న రామ్మోహన్ గౌడ్

Telangana Elections: ముద్ద‌గౌని రామ్మోహ‌న్ గౌడ్ మ‌ళ్లీ సొంత‌గూటికి చేరుకున్నారు. ఎల్బీనగర్‌లో మంత్రి హరీష్ రావు (harish rao) సమక్షంలో BRS పార్టీలో చేరారు. ఆయ‌న‌తో పాటు ప్రసన్న లక్ష్మి దంపతులు, ఇతర నాయకులు, కార్యకర్తలు కూడా చేరారు.

రామ్మోహన్ గౌడ్ ఉద్యమకారుడని కలిసి పని చేశాడని ఈ సంద‌ర్భంగా హ‌రీష్ రావు అన్నారు. సహచరుడినీ కాపాడుకోవాలి అని వచ్చామ‌ని కష్టకాలంలో పార్టీ కోసం పని చేసి ముక్కు సూటి తత్వం ఉన్న మనిషని తెలిపారు. “” రెండు సార్లు టికెట్ ఇచ్చాం. స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. 11 మంది కార్పొరేటర్లను గెలిపించారు. GHMC ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు తోడ్పాటు అందించారు. రామ్మోహన్ గౌడ్ కు BRS పార్టీ తగిన ప్రాధాన్యమిస్తుంది. ఆయన వెంట వచ్చే కార్యకర్తలకు తగిన అవకాశాలు ఉంటాయి. పార్టీ ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను. అందుకు నేను బాధ్యత తీసుకుంటాను. మన ఇంటి సమస్య మనం పరిష్కరించకుందాం. కాంగ్రెస్ గెలిచేది లేదు. డబ్బాలో రాళ్ళు వేసి కొడుతున్నారు. అన్ని సర్వేలు BRS గెలుపు ఖాయం అంటున్నాయి. హైకమాండ్ ఢిల్లీలో ఉండే పార్టీ కావాలా, గల్లీలో ప్రజల మధ్య ఉండే పార్టీ కావాలా ప్రజలు ఆలోచిస్తున్నారు “” అని హ‌రీష్ రావు అన్నారు.