Ponguleti Srinivas Reddy: కంట‌త‌డి పెట్టిన పొంగులేటి

Khammam: BRS నుంచి స‌స్పెండ్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (ponguleti srinivas reddy) కంట‌త‌డి పెట్టుకున్నారు. ఖమ్మంలో నిర్వహిస్తున్న జన గర్జన సభకు ప్రజలు రాకుండా BRS పార్టీ అడ్డుకుంటోంద‌ని ఆరోపించారు. ఇప్పటికే 1700 వాహనాలకు పైగా సీజ్ చేశారు అంటూ క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ప‌లు అవినీతి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో BRS పొంగులేటిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేసింది. దాంతో ఆయ‌న త్వ‌ర‌లో కాంగ్రెస్‌లో (congress) చేర‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.