‘మన్​ కీ బాత్’​లో ఎన్టీఆర్​ను ప్రస్తావించిన మోదీ!

Delhi: భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ‘101వ మన్ కీ బాత్’ (Mann ki bath)ఎపిసోడ్‌లో నటసార్వభౌమ నందమూరి తారక రామారావు(NTR) గురించి ప్రస్తావించారు. శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. కోట్లాది ప్రజల మనసుల్లో స్థానం సంపాదించిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. చిత్రరంగంతో పాటు రాజకీయ రంగంలో తన ప్రతిభతో ఆ మహనీయుడు చెరగని ముద్ర వేశారని ప్రధాని కొనియాడారు. 300పైగా చిత్రాల్లో నటించి అలరించిన ఎన్టీఆర్.. రాముడు, కృష్ణుడు పాత్రల్లో ఆయన నటన ఇప్పటికీ స్మరిస్తారని మోదీ అన్నారు. బహుముఖ ప్రజ్ఞతో ఎన్టీఆర్ సినీరంగంలో ఖ్యాతిగాంచారని, కోట్ల మంది హృదయాల్లో నిలిచిపోయారని ప్రధాని మోదీ అన్నారు.

నేడు (మే 28న) ఎన్టీఆర్​ శత జయంతి సందర్భంగా పలువురు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. గత కొంతకాలంగా టీడీపీ(TDP) ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.