Aaradhya bachchan: హైకోర్టులో పిటిషన్ వేసిన ఐష్ కూతురు

Mumbai: బాలీవుడ్ స్టార్ క‌పుల్ ఐశ్వ‌ర్య రాయ్‌(aishwarya rai), అభిషేక్ బ‌చ్చ‌న్‌ల(abhishek bachchan) గారాల‌ప‌ట్టి ఆరాధ్య బ‌చ్చ‌న్(aaradhya bachchan) పిటిష‌న్ వేసింది. దిల్లీలోని హైకోర్టులో ఆరాధ్య వేసిన పిటిష‌న్‌ను కోర్టు స్వీక‌రించింది. ఆరాధ్య‌పై ప‌లు యూట్యూబ్ ఛానెల్స్ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతోంద‌ని త‌ప్పుడు వార్త‌లు క్రియేట్ చేస్తున్నారు. అలాంటివారిపై కఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌ను వెంట‌నే యూట్యూబ్ నుంచి తొల‌గించాల‌ని పిటిష‌న్‌లో పేర్కొంది. ఇలాంటి త‌ప్పుడు వార్త‌లు క్రియేట్ చేసేవారిని అస్సలు స‌హించ‌బోమ‌ని దిల్లీ హైకోర్టు జ‌స్జిస్ హ‌రి శంక‌ర్ మండిప‌డ్డారు. ఇలాంటి విష‌యాల్లో యూట్యూబ్ కొన్ని పాల‌సీలు తీసుకురావాల‌ని తెలిపారు. ఇలాంటి వార్త‌లు ఒక్క‌సారి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే విప‌రీతంగా షేర్ చేస్తార‌ని దాని వ‌ల్ల ఆరాధ్య లాంటి మైన‌ర్ల‌కు ఎంతో న‌ష్టం క‌లుగుతుంద‌ని అన్నారు. వెంట‌నే ఆ వీడియోల‌ను, అలాంటి యూట్యూబ్ ఛానెళ్ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేసారు.