జ‌న‌సేన‌@20 ల‌క్షలు: ప‌వ‌న్ ఫుల్ ఖుష్‌

సినీ న‌టుడు, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న పార్టీ అధికారిక ట్విట‌ర్ ఖాతాకు 20 ల‌క్ష‌ల‌ మంది ఫాలోవ‌ర్లు ఉన్నందుకు హ‌ర్షం వ్య‌క్తం చేసారు. జ‌న‌సేన అధికారిక ట్విట‌ర్ ఖాతాకు నేటికి 2 మిలియ‌న్ ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్విట‌ర్ ద్వారా త‌న టీంకు శుభాకాంక్షలు తెలిపారు. మ‌న ట్విట‌ర్ ఖాతా ఫాలోవ‌ర్ల సంఖ్య‌ 20 ల‌క్షల‌కు చేరుకున్నందుకు శుభాకాంక్ష‌లు. పార్టీకి ప్రధాన బ‌లం అయిన పార్టీ బృందానికి, సోష‌ల్ మీడియా జ‌నసైనికుల‌కు నా హృద‌య‌పూర్వ‌క అభినందన‌లు అని ట్వీట్‌లో పేర్కొన్నారు. జ‌న‌సేన పార్టీ అఫీషియ‌ల్ ట్విట‌ర్ ఫాలోవ‌ర్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నారు. అయితే ఈ ట్విట‌ర్ ఖాతా కేవ‌లం పవ‌న్ క‌ళ్యాణ్ ట్విట‌ర్ ఖాతాను మాత్ర‌మే ఫాలో అవుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు జ‌న‌సేన అధికారిక ట్విట‌ర్ నుంచి 16వేల‌కు పైగా ట్వీట్లు వ‌చ్చాయి. 2016లో ప‌వ‌న్ కళ్యాణ్ ఈ ట్విట‌ర్ ఖాతాను ప్రారంభించారు. పార్టీకి సంబంధించిన ఎలాంటి విషయాలైనా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ ట్విట‌ర్ ఖాతా వేదిక‌గానే పంచుకుంటారు.