NTR30: తార‌క్​ ట్వీట్​ వైరల్​!

ఆర్​ఆర్​ఆర్​ ప్రభంజనం తర్వాత నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా NTR30. దాదాపు సంవత్సరంపైగా తారక్​ సినిమా విడుదల కాదు, కనీసం షూటింగ్​ కూడా ప్రారంభం కాకపోవడంతో చాలా నిరాశ పడిపోయారు ఫ్యాన్స్​. ఎట్టకేలకు ఇటీవలే NTR30 పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని షూటింగ్​ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి హాజరై ఫస్ట్​ క్లాప్​ కొట్టారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో తారక్​ సరసన బాలీవుడ్​ బ్యూటీ జాన్వీ కపూర్​ నటిస్తోంది. కాగా, ప్రస్తుతం ఈ సినిమాలోని యాక్షన్​ సీక్వెల్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా షూటింగ్‌ సెట్‌లోకి అడుగుపెట్టారు ఎన్టీఆర్‌. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియాలో అభిమానులతో ఓ వీడియోని పంచుకున్నారు.
ఏప్రిల్‌ 1న ఎన్టీఆర్‌ 30 సెట్‌లోకి అడుగుపెడుతున్న తారక్​ వీడియో నెట్టింట వైరల్​గా మారింది. ఓ గ్రాండియర్‌ సెట్‌లో ఎంట్రీ ఇస్తున్న దృశ్యాన్ని వీడియో తీసి తారక్‌ ట్విట్టర్‌లో షేర్​ చేశారు.

అయితే ఈ సెట్‌ కోట లోపలి భాగాన్ని తలపించేలా ఉంది. అయితే ఇది రాత్రి పార్టీ సాంగ్‌ కోసం వేసిన సెట్‌ తరహాలో ఉంది. ఇక ఈ వీడియోలో తారక్‌ వెనక నుంచి కనిపించారు. ఆయన కూడా పూల పూల షర్ట్ ధరించడంతో ఓ పాటని ఇందులో చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వీడియోని పంచుకుంటూ షేర్​ చేసిన ఎన్టీఆర్​ ‘కొరటాల శివతో మళ్లీ సెట్స్​కి రావడం గొప్పగా ఉంది’ అంటూ కామెంట్​ జతచేశారు. దీనిపై అభిమానులు స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రంగు రంగుల షర్ట్ ఎన్టీఆర్‌ మాస్‌ లోడింగ్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అసలైన మాస్‌ రెడీ అవుతుందంటున్నారు. ఈ సినిమా కోస్టర్‌ ఏరియా నేపథ్యంలో వదిలేయబడ్డ ఓ గ్రామానికి చెందిన కథతో రూపొందిస్తున్నారు. అక్కడ భయం ఎరుగని ప్రజలకు భయాన్ని పరిచయం చేయడం అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు దర్శకుడు కొరటాల క్లారిటీ ఇచ్చారు.

ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్‌ బ్లాక్​బస్టర్​ హిట్​గా నిలిచింది. వీరి కాంబినేషన్‌లో మరో సినిమాగా ఎన్టీఆర్‌30 చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకి హాలీవుడ్‌ టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు. స్టంట్స్ మాస్టర్‌ కెన్నీ బేట్స్, వీఎఫెక్స్ సూపర్‌ వైజర్‌గా హాలీవుడ్‌కి చెందిన బ్రాడ్‌ మిన్నిచ్‌ వర్క్ చేస్తుండటం విశేషం. దీంతో ఈ సినిమా అంతర్జాతీయ స్టాండర్డ్స్ లో రూపొందుతుందని తెలుస్తోంది. ఈ సినిమాని ఎన్టీఆర్‌ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై కళ్యాణ్‌ రామ్‌, మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు.