పది పరీక్ష కేంద్రాల వద్ద నో మొబైల్‌ జోన్‌!

ఏప్రిల్ 3వ తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు ఇప్పటికే అధికారులు పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఈక్రమంలో పరీక్షకు వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు కల్పించాయి. పరీక్ష హాల్‌ టికెట్టు చేపెట్టి వీరు బస్సుల్లో ఫ్రీగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవచ్చు. ఈ సందర్బంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. శనివారం మీడియాతో మాట్లాడారు. టెన్త్‌ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 3449 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో 6.69 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9.30 నుంచి 12.45 వరకు పరీక్ష సమయం ఉంటుందన్నారు. ఆరు సబ్జెక్ట్‌లకు పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లకు అనుమతి లేదు. ప్రభుత్వ టీచర్లు మాత్రమే ఇన్విజిలేటర్లుగా ఉంటారన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద నో మొబైల్ జోన్‌గా ప్రకటించాం. సెల్ ఫోన్, స్మార్ట్ పరికరాలు మొదలైనవి ఇన్విజలేటర్లు కూడా తీసుకురాకూడదు. పరీక్షలు జరిగే రోజున పరీక్షా కేంద్రాల పరిధిలోని ఆయా పాఠశాలలకి సెలవు ఉంటుందన్నారు. పరీక్షల నిర్వహణకి 800 స్క్వాడ్‌లు ఏర్పాటు చేశామని.