వివాహ‌బంధంతో ఒక్క‌టైన న‌రేష్‌, ప‌విత్ర‌

ప్ర‌ముఖ న‌టుడు వీ.కే న‌రేష్‌, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప‌విత్రా లోకేష్ వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు. స్నేహితులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో వీరిద్ద‌రూ ఏడ‌డుగులు న‌డిచారు. ఈ విష‌యాన్ని న‌రేష్ ట్విట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ పెళ్లి వీడియోను అభిమానుల‌తో పంచుకున్నారు. ఒక పవిత్ర బంధం.. రెండు మనసులు,, మూడు ముళ్లు.. ఏడు అడుగులు ..మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు ప‌విత్రా న‌రేష్ అని ట్వీట్ చేసారు. 2018లో వ‌చ్చిన స‌మ్మోహ‌నం సినిమాలో న‌రేష్‌, ప‌విత్ర దంప‌తులుగా న‌టించారు. ఈ సినిమా స‌మ‌యంలో వారిద్ద‌రూ ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డ్డారు. ఆ త‌ర్వాత సహ‌జీవ‌నం చేసిన‌ట్లు కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే కొన్ని నెల‌ల క్రితం మైసూరులోని ఓ హోట‌ల్‌లో ప‌విత్ర‌, న‌రేష్ ఉన్నార‌ని తెలిసి.. న‌రేష్ భార్య ర‌మ్య ర‌ఘుప‌తి రచ్చ చేసిన ఘ‌ట‌న వైర‌ల్‌గా మారింది. ప‌విత్ర‌, న‌రేష్‌ల‌ను చెప్పుతో కొడ‌తా అంటూ ఆమె హంగామా చేసారు. దాంతో పోలీసులు వ‌చ్చి ప‌రిస్థితిని హ్యాండిల్ చేయాల్సి వ‌చ్చింది. ఆ త‌ర్వాత ర‌మ్య ర‌ఘుప‌తి.. న‌రేష్ త‌న‌ను మోసం చేసి ప‌విత్ర‌తో ఉంటున్నార‌ని, ప‌విత్ర‌కు ఆల్రెడీ పెళ్లి అయ్యి పిల్ల‌లు ఉన్న‌ప్ప‌టికీ డ‌బ్బు కోస‌మే త‌న భ‌ర్త వెంట‌ప‌డుతోంది ఆరోపించారు.

దీనిపై న‌రేష్‌, ప‌విత్ర‌లు కూడా స్పందించారు. న‌రేష్‌తో ఏమ‌న్నా స‌మ‌స్య‌లు ఉంటే.. ఇంట్లో చూసుకోవాలి కానీ ఇలా మీడియా ముందుకు వ‌చ్చి త‌న గురించి త‌ప్పుగా మాట్లాడ‌టం స‌రికాదని పవిత్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ఆ త‌ర్వాత న‌రేష్ కూడా ర‌మ్య వేరొక‌రితో అఫైర్ పెట్టుకుంద‌ని, త‌న‌తో స‌రిగ్గా ఉండ‌టం లేద‌ని, ఇంట్లో జ‌రిగే ఏ కార్య‌క్ర‌మాల‌కు కూడా హాజ‌రుకాకుండా వేరొక‌రితో ఉంటోంద‌ని ఆరోపించారు. త‌న‌కు ఈ వ‌య‌సులో తోడుగా నిలిచి స‌పోర్ట్ చేసింది ప‌విత్ర మాత్ర‌మేన‌ని అందుకే ఆమెను త్వ‌ర‌లో వివాహం చేసుబోతున్న‌ట్లు కొన్ని నెల‌ల క్రితం ప్ర‌క‌టించారు. మ‌రోప‌క్క త‌న‌కు విడాకులు ఇవ్వ‌కుండా ప‌విత్ర‌ను ఎలా పెళ్లి చేసుకుంటారో నేనూ చూస్తా అంటూ స‌వాలు విసిరారు. అయితే.. త‌న‌కు ర‌మ్య‌కు విడాకులు ఎప్పుడో మంజూరు అయ్యాయ‌ని త‌న ప‌రువు తీయ‌డానికే రమ్య ఇలాంటి ప‌నులు చేస్తోంద‌ని నరేష్ తెలిపారు. మొత్తానికి న‌రేష్‌, ప‌విత్ర మూడుముళ్ల బంధంతో ఒక్క‌ట‌య్యారు.