‘ఎట్లయితే గట్లే.. చూసుకుందాం’ అదరగొడుతున్న దసరా ట్రైలర్​!

నేచురల్​ స్టార్​ నానీ హీరోగా ఫుల్​ మాస్​ అండ్​ యాక్షన్​ ఎంటర్​టైనర్​గా  తెరకెక్కిన దసరా మూవీ ట్రైలర్ ఈరోజే అనగా మార్చి 14న రిలీజ్ అయ్యింది.  ‘ధరణిగా పెట్టి పుట్టావ్ రా.. నా కొడకా..’ ఈ డైలాగ్ నుంచి ‘ఎట్లయితే గట్లే.. చూసుకుందాం’ వరకు ప్రతి డైలాగ్​తో  ట్రైలర్ అదిరిపోయింది. నాని ఎప్పుడూ కనిపించని పాత్రలో ప్రేక్షకులను మెప్పించబోతున్నాడని తెలుస్తోంది. ట్రైలర్​లో చూపించిన ప్రతి సీన్ యాక్షన్ అండ్ ఎమోషన్​గా సాగింది. ఫైట్స్​ అయితే ఓ రేంజ్ లో ఉన్నాయి. బాధ్యతారాహిత్యంగా చిల్లరగా తిరిగే హీరో ధరణి పాత్ర ఒక్కటే సినిమాను నడిపించినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. స్టార్టింగ్ లో బతుకమ్మ సంబరం దగ్గర కనిపించిన హీరోయిన్ కీర్తి సురేష్.. మళ్లీ చివర్లోనే కనిపిస్తుంది.

‘తాగి మర్చిపోవటం తప్పుకాదు.. తప్పు చేసి మర్చిపోవటం తప్పు’, ‘కత్తిని పట్టినావ్ అంటే.. ఏ తోవలో పోతున్నావో అర్థం అవుతుందా’ అంటూ ఒక్కో డైలాగ్​ ఒక్కో మాస్టర్​పీస్​లా ఉంది. ఈ డైలాగ్స్​తో హీరో కింది స్థాయి నుంచి ఎదిగే పాత్ర అని స్పష్టం అవుతుంది. ఓ గ్రామంలో జరిగే యుద్ధాన్ని గుర్తు చేస్తుంది ట్రైలర్.. కార్మికుల పక్షాన నిలిచే లీడర్ గా హీరో నాని ఎదిగే క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను తెరపై చిత్రీకరించారని అర్థమవుతోంది. ‘పురాణాలను మించిన బతుకులా మనవి’ అనే డైలాగ్స్ సినిమా కథలోని లోతుని తెలిసేలా చేస్తున్నాయి.

నాచురల్ స్టార్ నాని హీరోగా, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కిన దసరా మూవీలో నానికి జోడీగా కీర్తి సురేష్ నటించింది. తెలుగుతో పాటు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో పాన్​ ఇండియా సినిమాగా విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.