అన్‌స్టాపబుల్ షోలో నిజాలు చెప్తానంటున్న ల‌క్ష్మీ పార్వ‌తి

నందమూరి బాలకృష్ణ గురించి అందరికీ తెలిసిందే.. విలక్షణమైన నటనతో మాటతో.. డైలాగులతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంటారు. అటు సినిమాల్లో నటుడిగానే కాకుండా హిందూపూర్‌ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచి మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. మరోవైపు ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫాం వేదికగా అన్‌స్టాపబుల్‌ షోకి హోస్టుగా మారి ఆయన మాట, ఆటలతో ప్రేక్షకుల మనసు దోచేస్తున్నారు. ఇటీవల సెలబ్రీటీలతోపాటు.. రాజకీయ నాయకులు చంద్రబాబు, కిరణ్‌కుమార్‌ రెడ్డి, పవన్‌ కల్యాణ్‌లను ఇంటర్య్వూలకు పిలిచి అన్‌స్టాపబుల్‌ షోకి మంచి రేటింగ్‌ తెప్పించారు. అయితే.. టీడీపీ అధినేత బాలకృష్ణకు స్వయాన బావ అయిన చంద్రబాబుతో ఇంటర్య్వూ విడుదల తర్వాత వైసీపీ నుంచి అనేకమంది విమర్శలు గుప్తించారు. ముందుగానే స్క్రిప్ట్‌ రాసుకుని.. చంద్రబాబుకు మైలేజ్‌ వచ్చేలా.. ప్రజలకు వాస్తవాలు తెలియకుండా కట్టుకథలు అల్లారని అనేకమంది ఆరోపించారు. ఇక వారి సంగతి అటుంచితే.. దివంగత ఎన్టీఆర్‌ రెండో భార్య అయిన లక్ష్మీపార్వతీ అన్‌స్టాపబుల్‌ షో చంద్రబాబు, బాలయ్య మాట్లాడిన మాటలపై ఫైర్‌ అయ్యారు. బాలయ్య నన్ను అన్‌స్టాపబుల్‌ షోకి పిలుస్తావా అంటూ ఘాటుగా స్పందించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..

చంద్రబాబు వెన్నుపోటు గురించి నాకు తెలుసు..
టీడీపీ అధినేత చంద్రబాబు… ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన విషయం గురించి తనకు పూర్తిగా అవగాహన ఉందని.. బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ షోకి తనని పిలిస్తే.. అసలు వాస్తవాలు బయటపెడతానని లక్ష్మీపార్వతి తెలిపారు. నన్ను అన్ స్టాపబుల్ షోకు పిలుస్తావా అంటూ బాలయ్యను ఆమె ప్రశ్నించారు. తన తండ్రికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి నందమూరి ఫ్యామిలీ అండగా నిల్చున్నారని.. లక్ష్మీపార్వతి చాలా సార్లు వారిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.. తాజాగా ఆమె చేసిన కొన్ని వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. బాలకృష్ణను టార్గెట్ చేస్తూ లక్ష్మీ పార్వతీ షాకింగ్ కామెంట్స్ చేశారు.

నందమూరి తారకరత్న మరణించడం చాలా బాధకరమని ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మీపార్వతి తెలిపారు. ఆయన మరణం తనను కలిచివేసిందని చెప్పుకొచ్చారు. అనంతరం… తన భర్త ఎన్టీఆర్‌ను చంద్రబాబే వెన్నుపోటు పొడిచారని.. ఆ విషయం తనకు తెలుసునని అన్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ కొడుకులు కూడా చంద్రబాబు వైపు ఉన్నారని.. తన భర్తను ఒంటరిని చేసి.. హింసించారని ఆమె ఆరోపించారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన తన ఆస్తి మొత్తాన్ని తన కొడుకులు, కూతుర్ల పేరు మీదే రాశారని.. అప్పట్లో జరిగిన ప్రతి విషయం తనకు తెలుసునని ఆమె పేర్కొన్నారు. కావాలంటే.. వాటన్నింటికీ తానే సాక్ష్యమని.. ధైర్యం ఉండే బాలకృష్ణ తనను ఒక్కసారి అన్ స్టాపబుల్ షోకి పిలిస్తే.. అప్పట్లో జరిగిన వాస్తవాలను బయటపెడతానని ఆమె తెలిపారు. అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో నందమూరి తారకరత్న చనిపోవడానికి చంద్రబాబు, నారా లోకేష్ కారణమని లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఈ విషయం అప్పట్లో దుమారం రేపింది. అయితే… లక్ష్మీపార్వతి ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఉన్నారు. ఆమె తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా కూడా పనిచేస్తున్నారు.