KTR: తిరుప‌తి రెడ్డికి స్టే.. సామాన్యుల‌కు కూడా ఇప్పించండి

ktr slams hydraa

KTR: హైడ్రా కూల్చివేతల్లో ఎంతో మంది సామాన్యులు త‌మ ఇళ్ల‌ను కోల్పోయి వీధిన ప‌డ్డార‌ని.. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోద‌రుడు తిరుప‌తి రెడ్డికి మాత్రం హైకోర్టు స్టే ఇచ్చింద‌ని అన్నారు భార‌త రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ కిటుకేదో సామాన్యుల‌కు కూడా చెప్తే పాపం వారు కూడా త‌మ ఇళ్ల‌ను కాపాడుకుంటారు క‌దా అని ఆయ‌న అన్నారు.

“” LKG చదివే వేదశ్రీ కి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు! 50 ఏళ్ళ కస్తూరి బాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది! 72 గంటల క్రితం కొన్న ఇల్లు నేల మట్టమైంది! వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇల్లు, అన్ని కాగితాలు ఉన్నా….పేక మేడల కూల్చివేయబడింది! తిరుపతి రెడ్డి గారు… క్షణం కూడా సమయం ఇచ్చే ప్రసక్తే లేదన్న హైడ్రా…మీ విషయంలో నోరు ఎందుకు మెదపలేదు? వాల్టా అనుకుంటా….ఏకంగా మీకు 30 రోజుల టైం ఇచ్చింది! కోర్టులో స్టే సంపాదించుకున్నారు! ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణకాష్టంలో మట్టి కూడా అంటనిది బహుశా మీకు మాత్రమేనామో! మీ సోదరుడి బల్‌డోజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులకు ఆ కిటుకేదో చెప్పండి! “” అంటూ KTR ట్వీట్ చేసారు.