Kodi Kathi Case: కోడి కత్తి శ్రీను తల్లి పాదయాత్ర

Kodi Kathi Case: ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై (jagan mohan reddy) కోడి క‌త్తితో దాడి చేసిన శ్రీను త‌ల్లి సావిత్రమ్మ పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్నారు. ఫిబ్రవరి 2 నుంచి ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కోనసీమ జిల్లా ఠాణేలంకలో యాత్ర ప్రారంభం కానుంది. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రతిగడపకూ వివరిస్తామని జగన్ కోర్టుకు హాజరై కేసులో సాక్ష్యం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.