Jagan: అప్పుడు నేను సాయం చేసా.. ఇప్పుడు మీ వంతు

jagan mohan reddy demands exgratia for achyuthapuram incident victims

Jagan: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో రియాక్ట‌ర్ పేలి దాదాపు 13 మంది కార్మికులు మృతిచెందారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేసారు. గ‌తంలో ఎల్జీ పాలిమ‌ర్స్ ఘ‌ట‌న‌లో బాధితుల‌ను తాను ఆదుకున్న‌ట్లే.. ఇప్పుడు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రియాక్ట‌ర్ పేల‌డం వ‌ల్ల చ‌నిపోయిన వారి కుటుంబాల‌ను, క్ష‌తగాత్రుల‌ను ఆదుకోవాల‌ని అన్నారు.

“” అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మాకంపెనీలో రియాక్టర్‌ పేలుడు కారణంగా పలువురు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాను. వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్‌ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‌ చేస్తున్నాను. గాయపడి చికిత్సపొందుతున్న వారికి ఉచితంగా ఉత్తమ వైద్యం అందించాలి. వారు కోలుకునేంతవరకూ ఆర్థిక సహాయం చేయాలి. మా పార్టీ నాయకులతో కూడిన బృందం అక్కడ పర్యటించి, బాధితులకు తోడుగా నిలుస్తుంది. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరపాలి. మళ్లీ ఇలాంటివి జరక్కుండా గట్టి చర్యలు తీసుకోవాలి “” అని వెల్ల‌డించారు.