అడిగినంత ఇస్తేనే ‘దేశముదురు’ రీరిలీజ్​

డాషింగ్​ డైరెక్టర్​ పూరీ దర్శకత్వంలో అల్లు అర్జున్​ హీరోగా రూపొందిన సినిమా దేశముదురు. బన్నీకి కెరీర్​ పరంగా ఈ సినిమా చాలా ప్లస్​ అయ్యింది. ఈ సినిమాతో మాస్​ ప్రేక్షకులకు బాగా చేరువై ఫ్యాన్​ ఫాలోయింగ్​ సంపాదించుకున్నారు బన్నీ. హన్సికా మోత్వాని తెలుగు పరిశ్రమకు ఈ సినిమా ద్వారానే పరిచయం అయ్యారు. డి.వి.వి. దానయ్య నిర్మించిన ఈ సినిమాలోని పాటలు అప్పట్లో ఓ సంచలనం. దివంగత సంగీత దర్శకుడు చక్రీ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఇక, అల్లు అర్జున్ బర్త్​డే స్పెషల్​గా ఏప్రిల్ 7న ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఓ వార్త సోషల్​ మీడియాలో హల్​చల్​ చేస్తోంది. ఈ సినిమా స్పెషల్​ షోకి ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాలని డిమాండ్​ చేస్తున్నారట నిర్మాత దానయ్య. ​
ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయా హీరోల బర్త్ డే సందర్భంగా, వారు నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు స్టైలిష్​ స్టార్​ అల్లు అర్జున్ సినిమా ‘దేశముదురు’ కూడా రీరిలీజ్ కు రెడీ అవుతోంది. కొన్నాళ్లుగా టాలీవుడ్​ టాప్​ హీరోల బర్త్​డే స్పెషల్​గా వారి సూపర్​హిట్​ సినిమాలను రిలీజ్ చేస్తూ అభిమానులకు సర్​ప్రైజ్​ ఇస్తున్నారు దర్శకనిర్మాతలు. కాగా ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే సందర్భంగా దేశముదురు సినిమాని ఏప్రిల్ 7న పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త టెక్నికల్ హంగులు అద్దుతున్నట్లు సమాచారం. ఈ సినిమా రీ రిలీజ్ గురించి నిర్మాత డీవీవీ దానయ్యతో చర్చలు కొనసాగుతున్నాయట. అయితే, ఈ సినిమా విడుదల చేయాలంటే తనకు రూ. 25 లక్షలు ఇవ్వాలని అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఈ సినిమా విడుదల చేయాలని బన్నీ అభిమానులు పట్టుబడుతున్నట్లు సమాచారం.ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2 షూటింగ్​తో బిజీగా ఉన్నారు. ‘పుష్ప’ సినిమాతో పాన్​ఇండియా స్టార్​గా మారిన బన్నీ ఈ సినిమా సీక్వెల్​ కోసం బాగా కష్టపడుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ సినిమా విడుదలైన ప్రతి చోటా సంచలన విజయాన్ని అందుకుంది. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా బ్లాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన రెండో భాగం ‘పుష్ప2’ తెరకెక్కుతోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ సినిమా ఈ ఏడాది చివరలో విడుదలయ్యేందుకు సిద్ధం అవుతోంది.